News March 15, 2025
ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు.. 337 మంది గైర్హాజరు

ఖమ్మం జిల్లాలో శనివారం ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా అధికారులు తెలిపారు. జనరల్ కోర్సుల్లో 13,827 మందికి గాను 13,575 మంది, అలాగే ఒకేషనల్ కోర్సుల్లో 2,121 మంది విద్యార్థులకు గాను 2,036 మంది విద్యార్థులు హాజరయినట్లు చెప్పారు. రెండు కోర్సులకు గాను 337 మంది గైర్హాజరయ్యారన్నారు. అటు జిల్లాలో ఇవాళ ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు.
Similar News
News March 1, 2026
ఖమ్మం చేరుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆదివారం ఖమ్మం చేరుకున్నారు. స్థానిక రైల్వే స్టేషన్లో ఆయనకు శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు గోంగూర వెంకటేశ్వర్లుతో పాటు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్స్లో నిర్వహించిన వాజ్ పేయి శత జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
News March 1, 2026
ఖమ్మం: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూపులు..

ఖమ్మం జిల్లాలో నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోవడంతో అర్హులైన పేదలు ఇబ్బందులు పడుతున్నారు. కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని మంత్రులు చెబుతున్నా, ఆచరణలో మాత్రం దరఖాస్తులు పెండింగ్లోనే ఉన్నాయి. కొత్తకార్డులతో పాటు, కుటుంబ సభ్యుల పేర్ల చేర్పుల కోసం నెలల తరబడి వేచి చూస్తున్నామని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా మంత్రులు స్పందించి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని కోరుతున్నారు.
News March 1, 2026
రూ.5 లక్షలకు జిల్లా కోర్టులో ఐపీ దాఖలు

ఖమ్మం రూరల్ మండలం MVపాలెంకు చెందిన బొందల రాజశేఖర్- కళ్యాణి దంపతులు జిల్లా కోర్టులో రూ.5 లక్షలకు ఐపీ దాఖలు చేశారు. కాగా వీరు కొంతమంది రుణదాతల వద్ద అవసరాల నిమిత్తం రూ.5 లక్షలు అప్పుతీసుకొని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా వాటిని చెల్లించడం కష్టమైంది. దీంతో దంపతులు తమను దివాళా దారులుగా ప్రకటించాలని జిల్లా కోర్టులో తమ న్యాయవాది ద్వారా ఐపీ దాఖలు చేశారు.


