News March 15, 2025

నిజాంసాగర్: గ్రామస్థుల సహకారం అవసరం: కలెక్టర్

image

పాఠశాలల అభివృద్ధిలో గ్రామస్తుల సహకారం ఎంతో అవసరమని KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేర్కొన్నారు. నిజాంసాగర్ మండలం అచ్చంపేట ప్రాథమిక పాఠశాలలో కృత్రిమ మేధ ఆధారిత ఎఫ్‌ఎల్‌ఎన్ ల్యాబ్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన తల్లిదండ్రులకు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎఫ్‌ఎల్‌ఎన్ ల్యాబ్ విద్యార్థులకు సులభంగా మౌలిక భాషా గణిత సామర్ధ్యాలను సాధించడానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. 

Similar News

News November 13, 2025

BHPL: ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలి!

image

భూపాలపల్లి జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదువుతున్న బీసీ, ఈబీసీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని బీసీ అభివృద్ధి అధికారి ఇందిర తెలిపారు. ఏడాదికి రూ.4వేల మంజూరు కొరకు డిసెంబర్ 15లోగా https://telanganaepass.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News November 13, 2025

కీలక ప్రాంతాల రక్షణ మహిళా DCPల చేతుల్లోనే!

image

HYD, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని 16 జోన్లలో 7 జోన్లకు ప్రస్తుతం మహిళా డిప్యూటీ కమిషనర్‌‌లుగా వ్యవహరిస్తున్నారు. ఈ అధికారులు సౌత్ జోన్- స్నేహ మెహ్రా, మాదాపూర్ ఐటీ కారిడార్- కే.శిల్పవల్లి, కీలకమైన ఇంటెలిజెన్స్ వింగ్ వంటి సున్నితమైన, ప్రముఖ ప్రాంతాలకు నాయకత్వం వహిస్తున్నారు. ఇది నగర పోలీసింగ్‌లో మహిళల ప్రాతినిధ్యం మునుపెన్నడూ లేనంత బలంగా ఉందని సీనియర్ అధికారులు చెబుతున్నారు.

News November 13, 2025

OU: బీఈ కోర్సుల రివాల్యుయేషన్ ఫలితాల విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈ కోర్సుల పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీఈ (సీబీసీఎస్), బీఈ (నాన్ సీబీసీఎస్) కోర్సుల సెమిస్టర్ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.