News March 15, 2025

నిజాంసాగర్: గ్రామస్థుల సహకారం అవసరం: కలెక్టర్

image

పాఠశాలల అభివృద్ధిలో గ్రామస్తుల సహకారం ఎంతో అవసరమని KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేర్కొన్నారు. నిజాంసాగర్ మండలం అచ్చంపేట ప్రాథమిక పాఠశాలలో కృత్రిమ మేధ ఆధారిత ఎఫ్‌ఎల్‌ఎన్ ల్యాబ్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన తల్లిదండ్రులకు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎఫ్‌ఎల్‌ఎన్ ల్యాబ్ విద్యార్థులకు సులభంగా మౌలిక భాషా గణిత సామర్ధ్యాలను సాధించడానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. 

Similar News

News March 2, 2026

నిర్మల్: రైతులకు 1,40,000 యూరియా బస్తాలు అందజేత

image

జిల్లాలో ఫిబ్రవరి 8వ తేదీ నుంచి ప్రారంభమైన యూరియా బుకింగ్ యాప్ ద్వారా ఇప్పటివరకు రైతులు 1,60,000 వేల యూరియా బస్తాలు బుక్ చేసుకోగా 1,40,000 బస్తాలు పంపిణీ చేసినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు.

News March 2, 2026

ఖమేనీ అధీనంలో రూ.8.55లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం?

image

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సుమారు $95B (₹8.55లక్షల కోట్లు) విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. తొలి సుప్రీం లీడర్ ఖొమేనీ స్థాపించిన ‘సెటాడ్’ అనే రహస్య సంస్థ పరిధిలో ఇది ఉందని పేర్కొంది. ప్రజల ఆస్తులను జప్తు చేసి విక్రయించేవారని, ప్రతి రంగంలో ‘సెటాడ్‌’కి వాటాలున్నాయని ఆరోపించింది. అయితే ఖమేనీ తాను రిచ్ అయ్యేందుకు సెటాడ్‌ను వాడుకున్నారనేందుకు ఆధారాల్లేవని పేర్కొంది.

News March 2, 2026

ఇంటర్ ఫస్టియర్ గణితం పరీక్షలకు 408 మంది గైర్హాజరు

image

అనంతపురం జిల్లాలో నేడు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు గణితం పరీక్ష జరిగింది. పరీక్షలకు సెట్-1 ప్రశ్నపత్రాన్ని వాడినట్లు RIO వెంకటరమణ నాయుడు తెలిపారు. జనరల్ విద్యార్థులు 13,890 గాను 13,621 మంది హాజరు కాగా 269 మంది గైర్హాజరయ్యారన్నారు. ఒకేషనల్ విద్యార్థులు 2,258 గాను 2,119 మంది హాజరు కాగా 139 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. CC కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు.