News March 15, 2025

అల్లూరి: ఇంటర్ పరీక్షలకు 195మంది గైర్హాజరు

image

అల్లూరి జిల్లాలో 26 పరీక్ష కేంద్రాల్లో శనివారం ద్వితీయ ఇంటర్ జనరల్ కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు జరిగాయి. జనరల్ పరీక్షలకు మొత్తం 4,170మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 4050మంది రాసారని, 116ఆబ్సెంట్ అయ్యారని జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాధికారి అప్పలరాం తెలిపారు. 8కేంద్రాల్లో ఒకేషనల్ పరీక్షలకు 884మందికి గాను 805మంది హాజరు అయ్యారని, 79మంది ఆబ్సెంట్ అయ్యారని తెలిపారు.

Similar News

News March 22, 2026

PSL నుంచి IPLకు శనక

image

పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL) నుంచి శ్రీలంక T20 కెప్టెన్ దసున్ శనక తప్పుకోనున్నట్లు క్రీడావర్గాలు చెబుతున్నాయి. IPLలో RR తరఫున ఆయన ఆడే అవకాశముందని పేర్కొన్నాయి. గాయంతో దూరమైన సామ్ కరన్‌ను ఆయన రీప్లేస్ చేస్తారని సమాచారం. కాగా శనకను PSL వేలంలో లాహోర్ క్వాలెండర్స్ 2.2కోట్ల(PKR)కు కొనుగోలు చేసింది. ఇక ఆసీస్ ప్లేయర్ మాక్స్‌వెల్ సహా మరికొంతమంది ఆటగాళ్లు PSL నుంచి తప్పుకోనున్నట్లు వార్తలొస్తున్నాయి.

News March 22, 2026

మేడ్చల్: రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారా..?

image

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో నూతన రేషన్ కార్డుల మంజూరు, మెంబర్ల అడిషన్ ప్రక్రియ జరుగుతున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. మార్చి మొదటి వారంలో మెంబర్ అడిషన్ జరిగిన కొంతమంది ఇప్పటికీ రేషన్ బియ్యం పొందినట్లు పేర్కొన్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్నవారు అప్లికేషన్ నంబర్ సహాయంతో స్థానిక మీసేవ, నెట్ కేంద్రాల్లో స్టేటస్ చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

News March 22, 2026

కామారెడ్డి: ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి

image

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చెప్పారు. జిల్లా ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే స్వయంగా కలెక్టరేట్‌కు వచ్చి లిఖితపూర్వకంగా ప్రజావాణిలో ఫిర్యాదు చేయాలని సూచించారు. అధికారులు సమస్యలను పరిష్కరిస్తారని ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.