News March 15, 2025

బస్సులు, మెట్రో వినియోగం పెరగాలి: CM రేవంత్

image

TG: హైదరాబాద్‌లో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య పెరుగుతోందని CM రేవంత్ అన్నారు. ‘నగరంలో రోజుకు 1,600 వాహనాలు కొత్తగా రోడ్ల మీదకు వస్తున్నాయి. వాటి రిజిస్ట్రేషన్లతో ఆదాయం వస్తున్నా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. HYDలో ఒక వ్యక్తి వెళ్లినా ప్రత్యేకంగా కారులోనే వెళ్తున్నారు. బస్సులు, మెట్రోను ఉపయోగించుకునే వారి సంఖ్య పెరగాలి. దిల్లీలో కాలుష్యం పెరిగి విద్యాసంస్థలు, కార్యాలయాలు మూసివేశారు’ అని గుర్తుచేశారు.

Similar News

News March 15, 2025

నటి రన్యా రావు తండ్రిపై ప్రభుత్వం చర్యలు!

image

బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరులో పట్టుబడిన కన్నడ నటి రన్యా రావు కేసులో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆమె సవతి తండ్రి, హౌసింగ్ కార్పొరేషన్ DGP రామచంద్రారావును సెలవుల్లో పంపింది. ఆయన స్థానంలో కె.వి.శరత్ చంద్రను నియమించింది. మరోవైపు రన్యారావు బెయిల్ పిటిషన్‌ను ఈడీ న్యాయస్థానం తిరస్కరించింది. ఈ సందర్భంగా తనను కొట్టి తెల్ల కాగితాలపై పోలీసులు సంతకాలు చేయించుకున్నారని రన్యా రావు ఆరోపించారు.

News March 15, 2025

మళ్లీ నేనే సీఎం: రేవంత్ రెడ్డి

image

TG: రెండోసారి కూడా తానే సీఎం అవుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో అన్నారు. ‘తొలిసారి BRSపై వ్యతిరేకతతో మాకు ఓటు వేశారు. రెండోసారి మాపై ప్రేమతో వేస్తారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులే మా ఓటర్లు. నా పనిని నమ్ముకుని ముందుకు వెళ్తున్నా. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం’ అని తెలిపారు.

News March 15, 2025

కోటరీ వల్ల రాజూ పోయేవాడు.. రాజ్యమూ పోయేది: VSR

image

AP: పూర్వం కోటల్లో రాజుగారి చుట్టూ కోటరీ ఉండేదని, రాజ్యం ఎలా ఉన్నా ఆహా రాజా! ఓహో రాజా అంటూ తమ ఆటలు సాగించుకునేవారని విజయసాయి రెడ్డి అన్నారు. దీంతో రాజూ పోయేవాడు, రాజ్యం కూడా పోయేదని ట్వీట్ చేశారు. ‘కోటలో రాజు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలి. ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోవాలి. లేదంటే కోటరీ వదలదు, కోటా మిగలదు’ అని పేర్కొన్నారు. ఇటీవల జగన్ చుట్టూ కోటరీ ఉందని VSR ఆరోపించిన విషయం తెలిసిందే.

error: Content is protected !!