News March 15, 2025
రేపు జనగామ జిల్లాకు సీఎం రాక

జనగామ జిల్లాకు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ సందర్భంగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో రూ.800 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన చేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు నియోజకవర్గానికి రానున్న సందర్భంగా స్టేషన్ ఘనపూర్ మండలంలోని శివునిపల్లిలో సభకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News November 10, 2025
స్పోర్ట్స్ రౌండప్

➣ ఈ నెల 27న ఢిల్లీలో WPL మెగా వేలం
➣ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ స్టాండింగ్స్: మూడో స్థానంలో IND, తొలి రెండు స్థానాల్లో AUS, SL
➣ బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ ఫరూక్ అహ్మద్కు గుండెపోటు.. ఐసీయూలో చికిత్స
➣ రంజీ ట్రోఫీ: తమిళనాడుపై ఆంధ్రప్రదేశ్ విజయం.. ఫస్ట్ ఇన్నింగ్స్లో రషీద్ (87), సెకండ్ ఇన్నింగ్స్లో అభిషేక్ రెడ్డి (70), కరణ్ షిండే (51) హాఫ్ సెంచరీలు
News November 10, 2025
హనుమకొండ: అగ్నివీర్ ఎంపిక రెండో షెడ్యూల్ వివరాలు

హనుమకొండలో జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో భాగంగా ఈ నెల 17న నిర్మల్, రాజన్న సిరిసిల్ల (800 మంది), 18న మంచిర్యాల, పెద్దపల్లి, హైదరాబాద్ (781 మంది) అభ్యర్థులకు ఎంపికలు జరుగుతాయి. 19న సిద్దిపేట, కరీంనగర్, జనగామ, మహబూబాబాద్ జిల్లాల అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. రన్నింగ్, ఫిజికల్ ఫిట్నెస్, మెడికల్ టెస్ట్లు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ఆర్మీ అధికారులు తెలిపారు.
News November 10, 2025
JGTL: 3,750 ఎకరాల లక్ష్యంతో ఆయిల్ పాం సాగు

జగిత్యాల జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్యాక్స్ సంఘాలు భాగస్వామ్యం కానున్నాయి. ఈ సంవత్సరం నిర్దేశించిన 3,750 ఎకరాల లక్ష్యం చేరుకోకపోవడంతో అధికారులు ప్రతి ప్యాక్స్ పరిధిలో 100 ఎకరాల్లో సాగు చేయాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ రాజ గౌడ్ అధ్యక్షతన జరిగిన శిక్షణలో అధికారులు రైతులను వరి సాగు నుంచి ఆయిల్ పామ్ సాగు వైపు మళ్లించాలన్నారు. ఈ పంటకు రాయితీలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.


