News March 15, 2025
వేమూరులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం వేమూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కఠివరంకు చెందిన బత్తి శ్రీధర్(28) గుంటూరుకు చెందిన తోట సోము కుమార్ లు కొల్లూరు నుంచి ద్విచక్ర వాహనంపై తెనాలి వెళుతుండగా ఎదురుగా వస్తున్న టాటా ఏసీని ఢీకొట్టారు. శ్రీధర్ అక్కడికక్కడే మృతచెందగా సోము కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవికృష్ణ తెలిపారు.
Similar News
News January 7, 2026
అమ్మాయిలకు త్వరగా పెళ్లి కావాలంటే..

స్త్రీ జాతకంలో వివాహానికి కారకుడు గురువు. గురు బలం లేకపోతే ఎంత ప్రయత్నించినా సంబంధాలు నిశ్చయమవ్వవు. గురు గ్రహ అనుగ్రహం కోసం ప్రతి గురువారం రాఘవేంద్ర స్వామిని లేదా దత్తాత్రేయుని దర్శించుకోవాలి. గురువారం నాడు పసుపు రంగు వస్త్రాలు ధరించడం, శనగలు దానం చేయడం మంచిది. ‘ఓం బృహస్పతయే నమః’ అనే మంత్రాన్ని జపిస్తూ మేధా దక్షిణామూర్తిని పూజిస్తే జాతకంలో దోషాలు తొలగి, యోగ్యుడైన వరుడితో వివాహం నిశ్చయమవుతుంది.
News January 7, 2026
379 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News January 7, 2026
12 నుంచి శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

AP: శ్రీశైలంలో ఈ నెల 12-18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. 12న 9.15amకు స్వామివారి యాగశాల ప్రవేశం, బ్రహ్మోత్సవ సంకల్ప పఠనం ఉంటుంది. 13 నుంచి స్వామి, అమ్మవార్లకు వాహన సేవలు నిర్వహిస్తారు. 15న సంక్రాంతి వేళ బ్రహ్మోత్సవ కళ్యాణం జరిపిస్తారు. 18న పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంత సేవలతో ఉత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా 12-18వరకు ఆర్జిత, ప్రత్యక్ష పరోక్ష సేవలు నిలిచిపోనున్నాయి.


