News March 15, 2025

వేమూరులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం వేమూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కఠివరంకు చెందిన బత్తి శ్రీధర్(28) గుంటూరుకు చెందిన తోట సోము కుమార్ లు కొల్లూరు నుంచి ద్విచక్ర వాహనంపై తెనాలి వెళుతుండగా ఎదురుగా వస్తున్న టాటా ఏసీని ఢీకొట్టారు. శ్రీధర్ అక్కడికక్కడే మృతచెందగా సోము కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవికృష్ణ తెలిపారు.

Similar News

News March 16, 2025

శ్రీశైలంలో ఆన్‌లైన్ గదుల పేరుతో భక్తులకు టోకరా..!

image

AP: శ్రీశైలం క్షేత్రంలో ఆన్‌లైన్ మోసగాళ్లు వసతి గదుల పేరుతో నకిలీ వెబ్‌సైట్‌లు సృష్టించి భక్తులను మోసం చేస్తున్నారు. ఒక భక్తుడు మల్లికార్జున సదన్ పేరుతో ఉన్నవెబ్‌సైట్‌లో గదులు బుక్ చేసుకున్నారు. దీనికిగాను రూ.7000 చెల్లించాడు. తీరా గదుల కోసం విచారించగా నకిలీదని తేలింది. హైదరాబాద్‌కు చెందిన మరో వ్యక్తి ఈ విధంగానే మోసపోయాడు. అధికారులు స్పందించి మోసాలను అరికట్టాలని భక్తులు కోరుతున్నారు.

News March 16, 2025

జనగామ: బిక్షాటన చేస్తూ విద్యార్థుల నిరసన

image

జనగామ జిల్లా కేంద్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు వినూత్న రీతిలో బిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో వ్యాపార సముదాయాల్లో తిరుగుతూ భిక్షాటన చేశారు. సకాలంలో స్కాలర్షిప్లు రాకపోవడంతో ఫీజులు కట్టాలని కాలేజీలు ఒత్తిడికి గురి చేస్తుందన్నారు. ప్రభుత్వ స్పందించి వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

News March 16, 2025

ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య: కలెక్టర్ క్రాంతి

image

ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతుందన సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. పటాన్ చెరు మండలం ముత్తంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం శనివారం నిర్వహించారు. పాఠశాలలో విద్యాబోధన తీరని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులపై ఉందని చెప్పారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

error: Content is protected !!