News March 15, 2025
ఆ బ్యాంకు డిపాజిటర్లు భయపడొద్దు: RBI

ఇండస్ఇండ్ బ్యాంకుపై వదంతులను RBI కొట్టిపారేసింది. ‘డిపాజిటర్లు వాటిని నమ్మొద్దు. భయపడాల్సిన అవసరం లేదు. బ్యాంకు ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంది. తగినంత మూలధనమూ ఉంది. ఇప్పటికే మా ఎక్స్టర్నల్ ఆడిట్ టీమ్తో కలిసి A/Cను బ్యాంకు సమగ్రంగా సమీక్షిస్తోంది’ అని తెలిపింది. బ్యాంకు డెరివేటివ్ పోర్టుఫోలియోలో Rs1580 CR అవకతవకలు జరగడం, మొత్తం నెట్వర్త్పై దాని ప్రభావం 2.35% ఉంటుందన్న వార్తలపై స్పందించింది.
Similar News
News March 16, 2025
ఫెడరల్ వ్యవస్థ ప్రమాదంలో పడుతుంది: స్టాలిన్

రాజ్యాంగానికి మూలమైన ఫెడరల్ వ్యవస్థ ప్రస్తుతం ప్రమాదంలో పడుతుందని CMస్టాలిన్ ఆరోపించారు. విద్య, నిధుల అంశాల్లో రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలని అన్నారు. మద్రాస్ బార్ అసోసియేషన్ 160 సంవత్సరాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక న్యాయవాది తమిళంలో ప్రసంగిస్తారు అనుకుంటే ఇంగ్లీష్లో మాట్లాడారు. మరొకరేమో ఆంగ్లంలో అనుకుంటే తమిళంలో ప్రసంగించారు. ఇది తమిళనాడు ఇక్కడ రెండు భాషలే ఉంటాయని తేల్చిచెప్పారు.
News March 16, 2025
అమెరికాలో తుపాను ధాటికి 16మంది మృతి

అమెరికాలో తుపాను బీభత్సం సృష్టిస్తోంది. దీని వల్ల ఇప్పటివరకూ 16మంది మృతి చెందారు. మిస్సోరీ రాష్ట్రంలో 10మంది, అర్కన్నాస్లో ముగ్గురు మరణించగా వివిధ ప్రాంతాలలో పదుల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు. బలమైన గాలుల ధాటికి భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాలలో కార్చిచ్చులు చెలరేగడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీంతో రాష్ట్రాలకు వాతావరణ శాఖ ప్రమాద హెచ్చరికలు జారీచేసింది.
News March 16, 2025
శ్రీశైలంలో ఆన్లైన్ గదుల పేరుతో భక్తులకు టోకరా..!

AP: శ్రీశైలం క్షేత్రంలో ఆన్లైన్ మోసగాళ్లు వసతి గదుల పేరుతో నకిలీ వెబ్సైట్లు సృష్టించి భక్తులను మోసం చేస్తున్నారు. ఒక భక్తుడు మల్లికార్జున సదన్ పేరుతో ఉన్నవెబ్సైట్లో గదులు బుక్ చేసుకున్నారు. దీనికిగాను రూ.7000 చెల్లించాడు. తీరా గదుల కోసం విచారించగా నకిలీదని తేలింది. హైదరాబాద్కు చెందిన మరో వ్యక్తి ఈ విధంగానే మోసపోయాడు. అధికారులు స్పందించి మోసాలను అరికట్టాలని భక్తులు కోరుతున్నారు.