News March 15, 2025

బాపట్ల: ఇంటర్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన స్పెషలాఫీసర్

image

బాపట్ల పట్టణంలో ఇంటర్ పరీక్ష కేంద్రాలను బాపట్ల జిల్లా స్పెషల్ అధికారి కృతిక శుక్ల బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళితో కలిసి పరిశీలించారు. శనివారం ఇంటర్ పరీక్ష కేంద్రాలను పరిశీలించి పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. బాపట్ల జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకార్ జైన్, తదితర అధికారులు పాల్గొన్నారు.

Similar News

News March 15, 2026

బ్లాక్ మార్కెట్‌లో వంట గ్యాస్ సిలిండర్ రూ.6,500

image

వంట గ్యాస్‌ను బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరిస్తున్నా అక్రమార్కులు ఆగట్లేదు. NDTV పలు రాష్ట్రాల్లో చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. గ్యాస్ సిలిండర్‌కు ₹6,500, 14KGలు రీఫిల్ చేయడానికి ₹3,500-₹4K వరకు తీసుకుంటున్నారు. స్టవ్ రిపేర్ సెంటర్లు, కిరాణా దుకాణాల ద్వారా ఈ రాకెట్ నడుపుతున్నారు. ఏజెన్సీలే వీరికి బ్లాక్‌లో గ్యాస్ ఇస్తున్నట్లు తేలింది.

News March 15, 2026

వరంగల్: పల్లెలకు నిధుల జల్లు

image

గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. వరంగల్ జిల్లాకు రూ.14.93, హనుమకొండకు 13.65, భూపాలపల్లికి 4.65, జనగామకు 6.03, మహబూబాబాద్‌కు 9.30, ములుగు జిల్లాకు 17.13 కోట్ల చొప్పున నిధులు కేటాయించారు. కాగా అత్యధికంగా ములుగు జిల్లాకు, తక్కువగా భూపాలపల్లి జిల్లాకు కేటాయించారు. ఈ నిధులతో గ్రామాల్లో పెండింగ్‌లోని నిర్మాణాత్మక పనులను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

News March 15, 2026

శ్రీశైలంలో రేపటి నుంచి ఉగాది ఉత్సవాలు

image

జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో సోమవారం నుంచి ఉగాది ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 20వ తేదీ వరకు నిర్వహించే ఈ ఉత్సవాల్లో సోమవారం ఉదయం 9 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశం, చండీశ్వర పూజా కార్యక్రమాలతో ఉత్సవాలను ప్రారంభిస్తారు. ముఖ్యంగా అమ్మవారికి అలంకరణలు, స్వామి, అమ్మవార్ల వాహన సేవలు, 18న వీరాచారా విన్యాసాలు, 19న పంచాంగ శ్రవణం, రథోత్సవం, 20న పూర్ణాహుతి తదితర కార్యక్రమాలను నిర్వహిస్తారు.