News March 15, 2025
నిత్యవసర సరుకుల విక్రయాలపై అప్రమత్తంగా ఉండాలి: అల్లూరి కలెక్టర్

అల్లూరి జిల్లా పాడేరు కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం వినియోగదారుల వ్యవహారాల సదస్సులో కలెక్టర్ దినేశ్ కుమార్ పాల్గొన్నారు. ప్రజలందరూ స్థిరమైన జీవనశైలికి అలవాటు పడ్డారన్నారు. యువత, విద్యార్థులు, తల్లిదండ్రులు, వృద్ధుల్లో ఆలోచన విధానం మారాలని చెప్పారు. సంతల్లో విక్రయించే నాసిరకం పదార్థాలు, శీతల పానీయాలు విక్రయాలపై దృష్టి పెట్టాలన్నారు. కల్తీ నిత్యవసర సరుకుల అమ్మకాలపై చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News February 3, 2026
వరంగల్: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పెరిగిన మిర్చి ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పెరిగిన మిర్చి ధరలు రైతులకు ఊరటనిస్తున్నాయి. తేజ రకం మిర్చి క్వింటాకు రూ.19,300 పలికింది. అలాగే వండర్ హార్ట్ సోమవారం క్వింటాకు రూ.32,000 ధర పలకగా, మంగళవారం క్వింటాకు రూ.4 వేలు పెరిగి క్వింటాకు రూ.36,000 అత్యధిక ధర పలికింది. యూఎస్ 341 రకానికి క్వింటాకు రూ.26,000 ధర పలికింది.
News February 3, 2026
మార్కెట్లో మాయాజాలం.. గమనించారా?

వంట నూనెలు, పలు రకాల పప్పుల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. నెల రోజుల్లోనే సన్ఫ్లవర్ ఆయిల్ లీటరు రూ.150 నుంచి రూ.167కు చేరింది. వేరుశనగ నూనె రూ.180కు, పామాయిల్ ప్యాకెట్ రూ.120కు పెరిగింది. అటు వేరుశనగ పలుకులు కిలో రూ.140 నుంచి ఏకంగా రూ.200కు దూసుకెళ్లాయి. మరోవైపు కొన్ని కంపెనీలు మాయాజాలంగా ధర పెంచకుండా వంట నూనె లీటరు (910 గ్రాములు)కు బదులు 850, 800 గ్రాముల ప్యాకెట్లను తీసుకొస్తున్నాయి.
News February 3, 2026
కర్నూలు: భారీగా పడిపోయిన ధర

ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరశనగ ధర సోమవారం భారీగా పడిపోయింది. క్వింటా గరిష్ఠ ధర రూ.6,490 మాత్రమే పలికింది. మధ్యస్థ ధర రూ.6,190, కనిష్ఠ ధర రూ.4,570కు వ్యాపారులు కొనుగోలు చేశారు. కాగా, వారం రోజుల క్రితం (మంగళవారం) రికార్డు స్థాయిలో క్వింటా గరిష్ఠ ధర రూ.13,100 పలికింది. వారం రోజుల్లోనే ధరలు పతనమవ్వడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


