News March 15, 2025
వాళ్లకు కరెంట్, నీళ్లు కట్: సీఎం రేవంత్ హెచ్చరిక

TG: రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు CM రేవంత్ అన్నారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారి ఇళ్లకు కరెంట్, నీళ్లు కట్ చేస్తామని హెచ్చరించారు. మాదక ద్రవ్యాల విషయంలో ఎంతపెద్ద వారున్నా వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఫాంహౌస్లలో డ్రగ్స్ పార్టీలపై ఎప్పటికప్పుడు దాడులు చేస్తున్నామని వెల్లడించారు. కాలేజీల్లో గంజాయి, డ్రగ్స్ నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం వివరించారు.
Similar News
News March 16, 2025
ఫెడరల్ వ్యవస్థ ప్రమాదంలో పడుతుంది: స్టాలిన్

రాజ్యాంగానికి మూలమైన ఫెడరల్ వ్యవస్థ ప్రస్తుతం ప్రమాదంలో పడుతుందని CMస్టాలిన్ ఆరోపించారు. విద్య, నిధుల అంశాల్లో రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలని అన్నారు. మద్రాస్ బార్ అసోసియేషన్ 160 సంవత్సరాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక న్యాయవాది తమిళంలో ప్రసంగిస్తారు అనుకుంటే ఇంగ్లీష్లో మాట్లాడారు. మరొకరేమో ఆంగ్లంలో అనుకుంటే తమిళంలో ప్రసంగించారు. ఇది తమిళనాడు ఇక్కడ రెండు భాషలే ఉంటాయని తేల్చిచెప్పారు.
News March 16, 2025
అమెరికాలో తుపాను ధాటికి 16మంది మృతి

అమెరికాలో తుపాను బీభత్సం సృష్టిస్తోంది. దీని వల్ల ఇప్పటివరకూ 16మంది మృతి చెందారు. మిస్సోరీ రాష్ట్రంలో 10మంది, అర్కన్నాస్లో ముగ్గురు మరణించగా వివిధ ప్రాంతాలలో పదుల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు. బలమైన గాలుల ధాటికి భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాలలో కార్చిచ్చులు చెలరేగడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీంతో రాష్ట్రాలకు వాతావరణ శాఖ ప్రమాద హెచ్చరికలు జారీచేసింది.
News March 16, 2025
శ్రీశైలంలో ఆన్లైన్ గదుల పేరుతో భక్తులకు టోకరా..!

AP: శ్రీశైలం క్షేత్రంలో ఆన్లైన్ మోసగాళ్లు వసతి గదుల పేరుతో నకిలీ వెబ్సైట్లు సృష్టించి భక్తులను మోసం చేస్తున్నారు. ఒక భక్తుడు మల్లికార్జున సదన్ పేరుతో ఉన్నవెబ్సైట్లో గదులు బుక్ చేసుకున్నారు. దీనికిగాను రూ.7000 చెల్లించాడు. తీరా గదుల కోసం విచారించగా నకిలీదని తేలింది. హైదరాబాద్కు చెందిన మరో వ్యక్తి ఈ విధంగానే మోసపోయాడు. అధికారులు స్పందించి మోసాలను అరికట్టాలని భక్తులు కోరుతున్నారు.