News March 15, 2025
సిరిసిల్ల: నీటి సరఫరాకు అంతరాయం: ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్

సిరిసిల్లలోని 120MLD నీటి శుద్ధి కేంద్రంలోని తాగునీరు నీటి పంపు హౌస్లో పంపుల మరమ్మతు జరుగుతున్నందున ఈనెల 16న సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని EE శేఖర్ రెడ్డి తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో ఆయన శనివారం ప్రకటన విడుదల చేశారు. మళ్లీ ఈనెల 17వ తేదీన నీటి సరఫరా యథావిధిగా సాగుతుందని ప్రజలు సహకరించాలన్నారు.
Similar News
News December 29, 2025
జనవరి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు

TG: జనవరి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని BAC మీటింగ్లో నిర్ణయించారు. 4న ఆదివారం సెలవు ఉండనుంది. దీంతో కొత్త సంవత్సరంలో 5 రోజులు సమావేశాలు జరగనున్నాయి. అయితే, 15 రోజులు అసెంబ్లీని నిర్వహించాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. ప్రజాసమస్యలు పక్కదారిపట్టేలా BRS, కాంగ్రెస్ వ్యవహరిస్తున్నాయని BJP రాష్ట్రాధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. INC హామీలపై చర్చ జరగాలన్నారు.
News December 29, 2025
సూర్యాపేట: యూరియా పట్ల రైతులు ఆందోళన చెందొద్దు.!

సూర్యాపేట జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. సోమవారం అధికారులతో సమీక్షించిన ఆయన.. ప్రస్తుతం 10,508 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని చెప్పారు. అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు ఏదైనా సమస్యలు ఉంటే 6281492368 నంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
News December 29, 2025
గజగజ.. రేపు కూడా కొనసాగనున్న చలి తీవ్రత!

TGలో రేపు కూడా చలి తీవ్రత కొనసాగనుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ADB, కామారెడ్డి, ఆసిఫాబాద్, మంచిర్యాల, MDK, నిర్మల్, సంగారెడ్డి జిల్లాల్లో 5-10 డిగ్రీల మధ్య టెంపరేచర్ నమోదవుతుందంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో 11-15 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని చెప్పింది. ఉదయం, రాత్రివేళల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, బయటికి వెళ్తే తప్పనిసరిగా స్వెటర్లు ధరించాలని వైద్యులు సూచించారు.


