News March 15, 2025
ఎస్ఎస్సీలో 100% ఫలితాలు సాధించాలి: ఖుష్బూ గుప్తా

వచ్చే 10వ తరగతి పరీక్షల్లో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలల విద్యార్థులు 100% పాస్ అయ్యేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా సూచించారు. శనివారం ఉట్నూర్ పీఎంఆర్సీ సమావేశం మందిరంలో ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థులు పరీక్షలు సాఫీగా రాసేలా చూడాలన్నారు. రాబోయే 20 రోజులు ఉపాధ్యాయులకు సెలవు ఉందడన్నారు.
Similar News
News April 2, 2026
ఇసుక రవాణాలో పారదర్శకత పాటించాలి: ADB కలెక్టర్

జిల్లాలో ఇసుక రవాణా పారదర్శకంగా సాగాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘మన ఇసుక – వాహనం’ పోర్టల్ పనితీరు, ఇసుక నిల్వలను సమీక్షించారు. ఆన్లైన్ బుకింగ్ విధానం ద్వారా వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతి, మైనింగ్ ఏడీ రవీందర్ పాల్గొన్నారు.
News April 2, 2026
ADB: తొలిరోజు JEE ప్రశాంతం.. ఏడుగురు గైర్హాజరు

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని నలంద కళాశాలలో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్ష తొలి రోజు ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు రెండు సెషన్లలో పరీక్ష జరిగింది. కాగా ఉదయం జరిగిన పరీక్షకు 80 మంది విద్యార్థులకు గాను 73 మంది హాజరై ఏడుగురు గైర్హాజరయ్యారని పరీక్షల కో-ఆర్డినేటర్ పున్నారవ్ తెలిపారు. మధ్యాహ్నం కూడా ఏడుగురు గైర్హాజరయ్యారన్నారు.
News April 2, 2026
ఈనెల 5న అధికారికంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతి

ఈనెల 5న బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి మహోత్సవాన్ని ఆదిలాబాద్లో అధికారికంగా నిర్వహిస్తునట్లు జిల్లా కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. జయంతి సందర్భంగా ఉదయం 9 గంటలకు బాబూ జగ్జీవన్ చౌక్ వద్ద ఉన్న విగ్రహానికి పూలమాలల అలంకరణ కార్యక్రమం, ఆ తర్వాత ఎస్టీయూ భవనంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లా ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హాజరై మహనీయుని జయంతి విజయవంతం చేయాలని కోరారు.


