News March 15, 2025
ఎస్ఎస్సీలో 100% ఫలితాలు సాధించాలి: ఖుష్బూ గుప్తా

వచ్చే 10వ తరగతి పరీక్షల్లో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలల విద్యార్థులు 100% పాస్ అయ్యేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా సూచించారు. శనివారం ఉట్నూర్ పీఎంఆర్సీ సమావేశం మందిరంలో ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థులు పరీక్షలు సాఫీగా రాసేలా చూడాలన్నారు. రాబోయే 20 రోజులు ఉపాధ్యాయులకు సెలవు ఉందడన్నారు.
Similar News
News March 16, 2025
తాంసి: GREAT.. మూడు ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యాడు

తాంసి గ్రామానికి చెందిన జానకొండ అశోక్ గ్రూప్-3 ఫలితాల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ సాధించాడు. ఇప్పటికే గ్రూప్-1లో 399 మార్కులు, గ్రూప్-2లో 380 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 250వ ర్యాంక్ సాధించాడు. గ్రూప్-3లో 284 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 417వ ర్యాంక్ సాధించాడు. వరుసగా ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాలు సాధిస్తున్న అశోక్ ప్రస్తుతం జైనథ్ మండలంలో చాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు.
News March 16, 2025
భీంపూర్: రెండు ఉద్యోగాలకు ఎంపిక

భీంపూర్ మండలం అర్లీ(T) గ్రామానికి చెందిన రామెల్లి శివ గ్రూప్-3లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో 481 ర్యాంక్ సాధించాడు. ఇటీవల విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో సైతం ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో 319 ర్యాంక్ సాధించి శభాష్ అనిపించుకున్నాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందని శివ పేర్కొన్నారు.
News March 16, 2025
ADB: ఉచిత డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

నిరుద్యోగ బీసీ యువత కోసం బీసీ సహకార ఆర్థిక సంస్థ లిమిటెడ్ ఆధ్వర్యంలో రోడ్డు రవాణా సంస్థ ద్వారా ఉచిత హెవీ మోటర్ డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రాజలింగు తెలిపారు. HYD హకీంపేట్లో శిక్షణ ఉంటుందని, కనీసం 8వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు ఈనెల 31లోపు అన్ని ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తులను ఆదిలాబాద్లోని కార్యాలయంలో సమర్పించాలన్నారు.