News March 15, 2025
నంద్యాల తాగునీటి సరఫరాపై ఉన్నత స్థాయి సమీక్ష

నంద్యాల జిల్లాలో తాగునీటి సరఫరాపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని కలెక్టర్ కార్యాలయంలో శనివారం సాయంత్రం నిర్వహించారు. కలెక్టర్ రాజకుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వేసవి ముంచుకొస్తున్న నేపథ్యంలో తాగునీటి సమస్యపై జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Similar News
News March 16, 2025
పద్మ అవార్డుల దరఖాస్తులకు ఆహ్వానం

జనవరి 26 గణతంత్ర వేడుకల సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డులకు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి ఉన్నవారు జులై 31లోగా http://awards.gov.in వెబ్సైట్లో నామినేషన్లు అప్లోడ్ చేయాలని వెల్లడించింది. అదే విధంగా రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్లో నామినేషన్లు/ సిఫార్సులను పంపించవచ్చని తెలిపింది. 2026 సంవత్సరానికి సంబంధించి అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
News March 16, 2025
మస్క్ కుమారునికి సహాయం చేసిన ట్రంప్

మస్క్ కుమారుడిని ట్రంప్ హెలికాప్టర్ ఎక్కిస్తున్న ఫొటోలు నెట్టింట్లో వైరల్గా మారాయి. అమెరికా అధ్యక్షుడు ఫ్లోరిడాలోని తన ఇంటికి బయలుదేరగా ఆయనతో పాటు మస్క్ కుమారుడు వెళ్లాడు. ఆ ఛాపర్లోనికి ఎక్కడానికి పిల్లాడు ఇబ్బంది పడగా ట్రంప్ అతనికి సహాయం చేశారు. ఈ చిత్రాన్ని మస్క్ రీపోస్టు చేశారు. గత కొద్దిరోజులుగా టెస్లా అధినేత తన కుమారున్ని USA అధికార కార్యక్రమాలకు వెంట తీసుకెళుతున్న సంగతి తెలిసిందే.
News March 16, 2025
కృష్ణ: నేడు మంత్రి రాక.. భారీ బందోబస్తు సిద్ధం

మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం ముడుమాల్ గ్రామంలో ఉన్న ప్రపంచ ప్రఖ్యాతి పొందిన నిలువురాళ్ళను సందర్శించడానికి ఆదివారం కృష్ణ మండలం ముడుమాల్ గ్రామానికి రానున్నట్లు మక్తల్ సీఐ రామ్ లాల్ తెలిపారు. శనివారం కృష్ణ మండలం పరిధిలోని ముడుమల్ నిలువురాళ్లు సీఐ సందర్శించి మంత్రి రాకకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.