News March 15, 2025
NRPT: ‘హక్కుల చట్టంపై అవగాహన కలిగి ఉండాలి’

వినియోగదారుల హక్కుల చట్టంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా పరిషత్ సీఈఓ భాగ్యలక్ష్మి అన్నారు. శనివారం నారాయణపేట కలెక్టరేట్లో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మానవ జీవితంలో వస్తువుల వినియోగం తప్పనిసరి అని అన్నారు. వాటిని కొనుగోలు చేసిన సందర్భంలో నకిలీ వస్తువులుగా గుర్తిస్తే విక్రయించిన వారిపై ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 5, 2026
NGKL: ‘మహిళా సాధికారతతోనే సమాజాభివృద్ధి’

అంతర్జాతీయ మహిళా దినోత్సవం-2026 సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. అడిషనల్ కలెక్టర్ జి.వి. శ్యాంప్రసాద్ లాల్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. మహిళల అభివృద్ధి ద్వారానే సమాజం పురోగమిస్తుందని పేర్కొన్నారు.
News March 5, 2026
రేపటి నుంచి ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్: ఖమ్మం కలెక్టర్

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మార్చి 6 నుంచి 15 వరకు గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. గురువారం అధికారులతో జరిగిన సమీక్షలో ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్లను 10 రోజుల్లో క్లియర్ చేయాలని సూచించారు. మార్చి 12న సర్పంచ్లు, కౌన్సిలర్లకు జిల్లా స్థాయి వర్క్షాప్ నిర్వహించనున్నారు.
News March 5, 2026
తాడిపత్రిలో రైలు పట్టాలపై పడుకుని..!

తాడిపత్రి పట్టణంలోని పుట్లూరు రోడ్డు రైల్వే గేట్ సమీపంలో ఓ వ్యక్తి గురువారం హల్చల్ చేశాడు. రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన గూడ్స్ రైలు పైలట్ అప్రమత్తమై వెంటనే రైలును నిలిపివేశాడు. అనంతరం ఆ వ్యక్తిని హెచ్చరించడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో పుట్లూరు రోడ్డు రైల్వే గేట్ సుమారు 10 నిమిషాలు ఆలస్యంగా తెరుచుకుంది.


