News March 15, 2025
అనకాపల్లి జిల్లాలో టుడే టాప్ న్యూస్

➤ దిబ్బడి, కె.ఎం.పాలెంలో అగ్నికి ఆహుతైన తోటలు
➤ జిల్లావ్యాప్తంగా ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’ కార్యక్రమం
➤ CMRF చెక్కులను పంపిణీ చేసిన స్పీకర్
➤ చెత్త సంపద కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ విజయ కృష్ణన్
➤ ఖండివరం హైస్కూల్ HMకు షోకాజ్ నోటీసులు
➤ మాకవరపాలెంలో విద్యార్థులకు గ్రంధి వాపు పరీక్షలు
➤ నేటితో ముగిసిన ఇంటర్ సెకండియర్ పరీక్షలు
➤ స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేసిన మాడుగుల ఎమ్మెల్యే బండారు
Similar News
News March 16, 2025
జగిత్యాల: భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య, కుమారులు

JGTLరూరల్(M) పొలాసలో పడాల కమలాకర్(60)ను మొదటిభార్య, కుమారులు పెట్రోల్ పోసి శనివారం నిప్పంటించారు. గాయపడిన కమలాకర్ను ఆస్పత్రికి తీసుకెళ్లగా రాత్రి చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసుల ప్రకారం.. గతంలోనే కమలాకర్ 2 పెళ్లిళ్లు చేసుకున్నాడు. 3వ పెళ్లి చేసుకుని గ్రామంలోనే ఉంటున్నాడు. మద్యంతాగి మొదటి భార్య, కుమారులను వేధించేవాడు. కోపం పెంచుకున్న వారు కమలాకర్పై కత్తులతో దాడిచేసి పెట్రోల్ పోసి నిప్పటించారు.
News March 16, 2025
న్యూజిలాండ్తో మ్యాచ్.. 91 రన్స్కి పాక్ ఆలౌట్

న్యూజిలాండ్తో క్రైస్ట్చర్చ్లో జరుగుతున్న టీ20 మ్యాచ్లో పాక్ 91 పరుగులకే ఆలౌటైంది. ఖుశ్దిల్ షా(30 బంతుల్లో 32) మాత్రమే ఫర్వాలేదనిపించారు. సల్మాన్ అఘా(18), జహాందాద్ ఖాన్(17) మాత్రమే రెండంకెల స్కోర్ దాటారు. 11 రన్స్కే 4 వికెట్లు కోల్పోయిన పాక్ ఏ దశలోనూ కోలుకునేలా కనిపించలేదు. కివీస్ బౌలర్లలో డఫీ 4 వికెట్లు, జేమీసన్ 3, సోధీ 2, ఫౌక్స్ ఒక వికెట్ తీశారు.
News March 16, 2025
ఆదిలాబాద్-ఆర్మూర్ లైన్కు మోక్షం ఎప్పుడో…?

ఆదిలాబాద్-ఆర్మూర్ రైల్వే లైన్ ఏర్పాటుచేయాలని రెండు జిల్లాలకు చెందిన ప్రజలు కోరుతున్నారు. ADB నుంచి నిర్మల్, ఆర్మూర్, నిజామాబాద్కు నిత్యం భారీ సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తారు. వెంటనే ADB-ARMR రైల్వే లైన్ తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. అయితే రైల్వేలైన్ ఏర్పాటుచేయలేని ప్రభుత్వాలు ఎయిర్పోర్టు తెస్తామంటున్నాయని పలు విమర్శలు వినిపిస్తున్నాయి.