News March 15, 2025

అధికారులతో సమావేశం నిర్వహించిన మేయర్, కమిషనర్

image

బడ్జెట్ సమీక్షపై అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే సమావేశం నిర్వహించారు. 2025-26వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బల్దియా బడ్జెట్ రూపకల్పనపై సమర్పించిన అంచనాలు సమీక్షించి అధికారులకు మేయర్, కమిషనర్ పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

Similar News

News November 1, 2025

రేపే ఫైనల్: అమ్మాయిలూ అదరగొట్టాలి

image

ఉమెన్స్ ODIWC ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. ముంబై వేదికగా రేపు 3PMకు భారత్- సౌతాఫ్రికా మ్యాచ్ ప్రారంభం కానుంది. సెమీస్‌లో AUSను చిత్తు చేసిన జోష్‌లో ఉన్న IND.. ఫైనల్లోనూ గెలిచి తొలి WCను ముద్దాడాలని ఉవ్విళ్లూరుతోంది. స్మృతి, జెమీమా, హర్మన్, రిచా, దీప్తి, చరణి, రాధ, రేణుక ఫామ్ కంటిన్యూ చేస్తే గెలుపు నల్లేరుపై నడకే. SA కెప్టెన్ లారా, నదినె, కాప్‌లతో INDకు ప్రమాదం పొంచి ఉంది.
* ALL THE BEST TEAM INDIA

News November 1, 2025

గడ్డెన్న ప్రాజెక్టు పరీవాహక ప్రాంత ప్రజలు జాగ్రత్త

image

భైంసా గడ్డెన్న ప్రాజెక్టు పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు మూడో విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఈఈ) సూచించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం చేరుకోవడం వల్ల వరద గేట్ల నుంచి ఏ క్షణమైనా నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందన్నారు. నదీ పరీవాహక ప్రాంతాల్లోకి పశువుల కాపరులు, రైతులు ఎవరూ వెళ్లకూడదని ఆయన సూచించారు.

News November 1, 2025

KNR: తడిసిన ధాన్యాన్ని సేకరిస్తున్నాం: కలెక్టర్

image

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షానికి తడిసిన ధాన్యాన్ని సేకరిస్తున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 785 మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని గుర్తించామని, IKP, PACs ద్వారా కొనుగోలు బాయిల్డ్ రైస్ మిల్స్కు తరలించినట్టు పేర్కొన్నారు. ఇప్పటివరకు కొంతమంది రైతులకు సుమారుగా రూ.57 లక్షలు జమ చేశామని తెలిపారు. మిగతా రైతులకు కూడా జమ అవుతాయన్నారు.