News March 15, 2025

అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే

image

పరకాల నియోజకవర్గ యువత, మహిళలు స్వయం ఉపాధి, ఉద్యోగ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా అధికారులు తోడ్పడాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో పరకాల నియోజకవర్గం పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్,ట్రైనింగ్ సెంటర్, డెయిరీల ఏర్పాటు పై జిల్లా కలెక్టర్, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Similar News

News March 13, 2026

సూర్యాపేట: టెన్త్ పరీక్షా కేంద్రాల్లో వైద్య శిబిరాలు

image

పదో తరగతి పరీక్షల దృష్ట్యా జిల్లాలోని 69 కేంద్రాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు DMHO డాక్టర్ వెంకటరమణ తెలిపారు. సూర్యాపేటలో 41, కోదాడలో 28 కేంద్రాల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా అల్పాహారం తీసుకోవాలని, ఎండల తీవ్రత దృష్ట్యా వెంట మంచి నీళ్ల బాటిల్ తెచ్చుకోవాలని సూచించారు. ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే వెంటనే సిబ్బందిని సంప్రదించాలని కోరారు.

News March 13, 2026

బ్లాక్‌లో గ్యాస్ అమ్మితే కఠిన చర్యలు: కలెక్టర్ సత్య శారద

image

జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్ కొరత లేదని, ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్‌లో విక్రయిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ సత్య శారద స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా ఎనర్జీ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. నిరంతరాయంగా గ్యాస్ సరఫరాను పర్యవేక్షించాల్సిన బాధ్యత కమిటీపై ఉందన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే డీలర్ల లైసెన్సులను రద్దు చేయడంతో పాటు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 13, 2026

చిత్తూరు: ముగ్గరికి రెండేళ్ల జైలు శిక్ష

image

ఎర్రచందనం కేసులో తిరుపతి స్పెషల్ రెడ్ శాండిల్ కోర్టు నిందితులకు జైలు శిక్ష విధించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. 2014 నవంబర్‌లో రొంపిచర్ల పోలీసు స్టేషన్ పరిధిలో శేషాచలం అటవీ ప్రాంతం నుంచి 10 ఎర్రచందనం దొంగలు అక్రమ రవాణా చేస్తూ ముగ్గురు నిందితులు పట్టుపడ్డారు. నిందితులు తేజ ప్రకాష్ రెడ్డి, గురునాథ్, శివకుమార్‌కు కోర్టు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించినట్లు వెల్లడించారు.