News March 16, 2025
TODAY HEADLINES

* రాష్ట్రం కోసం ఎన్ని సార్లైనా ఢిల్లీ వెళ్తా: రేవంత్
* BRS కంటే మా పాలనలోనే ఎక్కువ రుణమాఫీ: భట్టి
* కాంగ్రెస్ పాలన దేశ చరిత్రలోనే మాయని మచ్చ: KTR
* హిందీని నేనెప్పుడూ వ్యతిరేకించలేదు: పవన్
* కోటరీ వల్ల రాజూ పోయేవాడు.. రాజ్యమూ పోయేది: VSR
* గుంటూరు మేయర్ మనోహర్ రాజీనామా
* తగ్గిన బంగారం ధరలు
* హమాస్కు మద్దతు.. USలో భారతీయ విద్యార్థిని వీసా రద్దు
Similar News
News March 7, 2026
మాయా లోకమా.. ఎత్తు మారిపోతోందేంటి?

అమెరికాలోని ‘ఒరెగాన్ వోర్టెక్స్’ సైన్స్కే సవాలు విసురుతోంది. ఇక్కడ అడుగుపెడితే చాలు ప్రకృతి నియమాలు తలకిందులవుతాయి. బంతిని కిందకు విసిరితే అది పైకి దొర్లుతుంది. మనుషుల ఎత్తు కూడా ఒకచోట తక్కువగా, మరోచోట ఎక్కువగా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తుంది. ఇది కేవలం కంటి భ్రమనా లేక అయస్కాంత శక్తి ప్రభావమా అనేది నేటికీ ఒక అంతుచిక్కని రహస్యమే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో- వంద వింతలు’లో..
News March 7, 2026
సివిల్స్లో సత్తా చాటిన వైభవ్ మేనమామ

టాలెంటెడ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మేనమామ అభిషేక్ సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటారు. తొలి ప్రయత్నంలోనే 102వ ర్యాంకు సాధించారు. దీంతో అల్లుడు క్రికెట్లో, మామ సివిల్స్లో అదరగొట్టారని పలువురు ప్రశంసిస్తున్నారు. 27 ఏళ్ల అభిషేక్ స్వస్థలం బిహార్లోని రాజజన్ గ్రామం. ఎంటెక్లో గోల్డ్ మెడల్ సాధించిన అతను 2022 నుంచి సివిల్స్కు సిద్ధమవుతున్నారు. అభిషేక్ తండ్రి అభయ్ నలంద ఓపెన్ వర్సిటీ రిజిస్ట్రార్.
News March 7, 2026
జాగ్రత్త.. రేపు అన్ని జిల్లాల్లో 36°C-40°C

TG: రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో సాధారణం కంటే 3°C-4°C డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అన్ని జిల్లాల్లో 36°C-40°C ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఆస్కారముందని పేర్కొంది. ఈ మేరకు అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ భద్రాచలం, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో 38°C-40°C మధ్య టెంపరేచర్ నమోదైందని తెలిపింది.


