News March 16, 2025
పదోతరగతి పరీక్షలు పటిష్టంగా నిర్వహించాలి: కలెక్టర్

జిల్లాలో ఈనెల 17 నుంచి నిర్వహించే పదోతరగతి పరీక్షలు సమర్ధవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ వెట్రి సెల్వీ ఆదేశించారు. పేపరు లీకేజీలు వంటివి జరుగకుండా పటిష్ట భధ్రతా ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షల నిర్వహణపై సోషల్ మీడియా వంటి ప్రచార మాధ్యమాల్లో వదంతులు వ్యాపించకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లను అనుమతించరాదన్నారు.
Similar News
News November 5, 2025
NLG: 4400 క్వింటాళ్ల పత్తి కొనుగోలు

నల్గొండ జిల్లాలో 23 జిన్నింగ్ మిల్లుల పరిధిలో L-1 కింద ఉన్న 9 కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభించినట్లు మార్కెటింగ్ శాఖ ఏడి ఛాయాదేవి తెలిపారు. ఇప్పటివరకు 4400 క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు చెప్పారు. సీసీఐ నిబంధనల ప్రకారం 8 నుంచి 12% తేమ ఉండడంతో పాటు కపాస్ కిసాన్ అనే యాప్లో స్లాట్ బుక్ చేసుకున్న రైతులు మాత్రమే స్లాట్ ఆధారంగా పత్తిని కొనుగోలు కేంద్రాల్లోకి తీసుకురావాలని సూచించారు.
News November 5, 2025
NLG: కొనసాగుతున్న ప్రైవేట్ కళాశాలల బంద్

జిల్లాలో ప్రైవేట్ కళాశాలల నిరవధిక బంద్ కొనసాగుతుంది. రెండో రోజు ఉమ్మడి జిల్లాలోని MGU పరిధిలో కొనసాగింది. బంద్లో భాగంగా తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ యూనివర్సిటీ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలల నిర్వహణ కష్టంగా మారిందన్నారు.
News November 5, 2025
సిరిసిల్ల: ఈనెల 15న ప్రత్యేక లోక్ అదాలత్

ఈనెల 15న జరిగే ప్రత్యేక లోక్ అదాలత్లో ప్రైవేట్ కంప్లైంట్ కేసులు, పాత కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టాలని ఇన్ఛార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, అధ్యక్షురాలు జిల్లా న్యాయ సేవాధికర సంస్థ పుష్పలత సూచించారు. మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో సిరిసిల్ల బార్ అసోసియేషన్ న్యాయవాదులతో స్పెషల్ లోక్ అదాలత్పై ఆమె సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడారు.


