News March 16, 2025

తాడూర్: ప్రభుత్వ పాఠశాలల్లో AI బోధన ప్రారంభం

image

నాగర్ కర్నూల్ జిల్లా తాడూర్ మండలంలో అదనపు కలెక్టర్ పి.అమరేందర్, డీఈఓ రమేష్ కుమార్ ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తరగతులను ప్రారంభించారు. ఈ తరగతులు విద్యార్థుల అభ్యాసాలను మెరుగుపర్చడంతో పాటు, తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తాయని అధికారులు తెలిపారు. జిల్లాలోని 13 పాఠశాలల్లో పైలెట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమం అమలవుతోందన్నారు.

Similar News

News November 4, 2025

సంగారెడ్డి: ‘లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి’

image

ఈ నెల 15న నిర్వహించే ప్రత్యేక లోక్ అదాలత్‌లో కక్షిదారులు తమ బ్యాంకు, ఇన్సూరెన్స్, చిట్‌ఫండ్స్‌ కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర అన్నారు. సంగారెడ్డి కోర్టులో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం అందుతుందని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య, లీడ్ బ్యాంక్ మేనేజర్ నర్సింగ్ రావు పాల్గొన్నారు.

News November 4, 2025

ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు ఉదయం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. KMM, నల్గొండ, SRPT, MHBD, WGL, హనుమకొండ, RR, వికారాబాద్, సంగారెడ్డి, MBNR, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. HYD, NRPT, GDL, జనగామ, SDPT, భువనగిరి, మేడ్చల్, MDK జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడొచ్చని తెలిపింది.

News November 4, 2025

సంగారెడ్డి: ఉన్నత చదువులు.. 30 మంది టీచర్లకు అనుమతి

image

సంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు దూరవిద్య ద్వారా ఉన్నత చదువులు చదివేందుకు అనుమతిస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో 30 మంది ఎస్‌జీటీ ఉపాధ్యాయులు ఉన్నత చదువులకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నారని డీఈఓ తెలిపారు. ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.