News March 16, 2025
NRPT: ‘మహిళల రక్షణే షీ టీమ్ లక్ష్యం’

మహిళలకు రక్షణ కల్పించడమే ప్రధాన ధ్యేయంగా షీ టీమ్ ఏర్పాటు చేశామని నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. జిల్లాలో ఎక్కడైనా ఆకతాయిలు నుంచి మహిళలకు వేధింపులకు గురైతే నిర్భయంగా షీ టీమ్ పోలీసులకు నేరుగా లేదా 8712670398 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. గృహహింస, మానసికంగా వేధింపుల, అదనపు కట్నం వేధింపులపై ఫిర్యాదు చేయవచ్చని అన్నారు.
Similar News
News January 7, 2026
భార్య నన్ను కొడుతోంది: నటుడు ధనుష్

భార్య ఆశ్రిత తనను కొడుతోందని కన్నడ నటుడు ధనుష్ రాజ్ గిరినగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనపై దాడి చేసి, బాత్రూమ్లో గాజు పగలగొట్టి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నట్టు కంప్లైంట్లో పేర్కొన్నారు. కట్నం కోసం వేధించారని, ఫిజికల్గా దాడి చేశారని సౌత్ డివిజన్ మహిళా పోలీస్ స్టేషన్లో ధనుష్ భార్య ఆశ్రిత కూడా ఫిర్యాదు చేశారు. తనకు అబద్ధం చెప్పి వేరే మహిళతో విదేశాలకు వెళ్లాడని ఆరోపించారు.
News January 7, 2026
BREAKING: ప్రీ క్వార్టర్ ఫైనల్కు క్వాలిఫై అయిన ఏపీ టీమ్

69వ జాతీయ U-14 బాలికల వాలీబాల్ టోర్నమెంట్లో ఏపీ టీమ్ సత్తా చాటుతోంది. ఇవాళ గోవాపై గెలిచి ప్రీ క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించింది. జమ్మలమడుగు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ పోటీలు జరుగుతున్నాయి. వరుసగా మూడు సెట్లలో ఆధిపత్యం కనబరిచి మరో 2 సెట్లు ఉండగానే విజయం సాధించింది. దీంతో వారిని పలువురు అభినందిస్తున్నారు. రేపు జరిగే ప్రీ క్వార్టర్ ఫైనల్లో విజయం సాధిస్తే క్వార్టర్ ఫైనల్కు చేరుతుంది.
News January 7, 2026
పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం వద్దు: కలెక్టర్

రెవెన్యూ శాఖ పరిధిలోని పెండింగ్ దరఖాస్తులు, భూ సమస్యలు, వివిధ సంక్షేమ పథకాలతో సంబంధం ఉన్న వినతులను ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం ఆదిలాబాద్ కలెక్టరేట్లో రెవెన్యూ, సర్వే శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. పీవో యువరాజ్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ఉన్నారు


