News March 16, 2025
జగిత్యాల: గడువులోగా అభివృద్ధి పనులు పూర్తిచేయాలి: కలెక్టర్

నిర్దేశిత గడువులోగా అభివృద్ధి పనులను పూర్తిచేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. జగిత్యాల కలెక్టరేట్లో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా గ్రామీణ పంచాయతీరాజ్ విభాగానికి సంబంధించి పనులు, పీఎంజీఎస్ఐ పురోగతిలో ఉన్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా అన్ని పనులనుపూర్తి చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్ లత తదితర అధికారులున్నారు.
Similar News
News November 14, 2025
అనధికార షాపులను తొలగించాలి: ఈవో వెంకట్రావు

యాదాద్రి ఆలయ పరిసరాల్లో ప్రైవేట్ ప్రకటనలు, ఫ్లెక్సీలను, అనధికారిక షాపులను నిషేధించి, కఠిన చర్యలు తీసుకోవాలని ఈవో వెంకటరావు అధికారులను ఆదేశించారు. ఆలయ భూములు కబ్జాకు గురికాకుండా కాంపౌండ్ వాల్, బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. టెండర్లు పారదర్శకంగా నిర్వహించాలని, దుకాణాల వద్ద ధరల వివరాలు తప్పక ఉంచాలని స్పష్టం చేశారు. సేవాభావంతో పనిచేయాలని సిబ్బందికి సూచించారు.
News November 14, 2025
పోలీస్ మైదానం పనులు పరిశీలించిన ఎస్పీ శ్రీనివాసరావువాస రావు

పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న క్రికెట్ మైదానం పనులను ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు శుక్రవారం పరిశీలించారు. పనుల పురోగతిపై సంబంధిత అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మైదానం నిర్మాణాన్ని వేగవంతం చేసి, పోలీస్ సిబ్బంది వినియోగానికి త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ మైదానం సిబ్బంది శారీరక దారుఢ్యం, క్రీడాస్ఫూర్తి పెంపొందించడానికి ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.
News November 14, 2025
కృష్ణా: పొలాల్లో తగ్గని వర్షపు నీరు.. కుళ్లిపోతున్న వరి పనలు

మొంథా తుపాన్ బారిన పడిన రైతాంగం నేటికీ కోలుకోలేని పరిస్థితి కృష్ణా జిల్లాలో నెలకొంది. తుపాన్ ప్రభావం తగ్గి 20 రోజులు గడుస్తున్నా నేటికీ కొన్ని ప్రాంతాల్లో పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీరు తగ్గకపోవటంతో దాని ప్రభావం దిగుబడులపై చూపుతోంది. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వర్షపు నీటిలో వరి పనలు నానిపోవడంతో ధాన్యపు కంకులు కుళ్లిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


