News March 16, 2025
శుభ ముహూర్తం (16-03-2025)

☛ తిథి: బహుళ విదియ మ.2.51 వరకు తదుపరి తదియ
☛ నక్షత్రం: హస్త ఉ.10.05 తదుపరి చిత్త
☛ శుభ సమయం: ఉ.08.06 నుంచి 8.44 వరకు మ.2.32 నుంచి 2.44 వరకు
☛ రాహుకాలం: సా.4.30 నుంచి 6.00 వరకు
☛ యమగండం: మ12నుంచి 1.30 వరకు
☛1.దుర్ముహూర్తం: సా.4.25 నుంచి 5.13వరకు
☛ వర్జ్యం: సా.6.56నుంచి 8.42 వరకు
☛ అమృత ఘడియలు: తె.5.35
Similar News
News March 16, 2025
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు హత్య

లష్కరే తోయిబా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు అబు ఖతల్ నిన్న రాత్రి పాకిస్థాన్లో హత్యకు గురయ్యాడు. 26/11 ముంబై ఉగ్రవాద దాడులకు మాస్టర్ మైండ్ అయిన హఫీజ్ సయీద్కు ఇతడు దగ్గరి అనుచరుడు. సయీద్ ఆదేశాలతో J&Kలోని మైనారిటీలు, భద్రతా బలగాలపై దాడులకు పాల్పడ్డాడు. ఖతల్ పర్యవేక్షణలోనే రియాసీ జిల్లాలోని భక్తుల బస్సుపై దాడి జరిగింది. ఇందులో 9 మంది మరణించారు. ఖతల్ కోసం NIA ఎప్పటినుంచో వెతుకుతోంది.
News March 16, 2025
న్యూజిలాండ్తో మ్యాచ్.. 91 రన్స్కి పాక్ ఆలౌట్

న్యూజిలాండ్తో క్రైస్ట్చర్చ్లో జరుగుతున్న టీ20 మ్యాచ్లో పాక్ 91 పరుగులకే ఆలౌటైంది. ఖుశ్దిల్ షా(30 బంతుల్లో 32) మాత్రమే ఫర్వాలేదనిపించారు. సల్మాన్ అఘా(18), జహాందాద్ ఖాన్(17) మాత్రమే రెండంకెల స్కోర్ దాటారు. 11 రన్స్కే 4 వికెట్లు కోల్పోయిన పాక్ ఏ దశలోనూ కోలుకునేలా కనిపించలేదు. కివీస్ బౌలర్లలో డఫీ 4 వికెట్లు, జేమీసన్ 3, సోధీ 2, ఫౌక్స్ ఒక వికెట్ తీశారు.
News March 16, 2025
నేడు అమరజీవి జయంతి

మద్రాస్ ప్రెసిడెన్సీలోని తెలుగు ప్రాంతాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు. దీక్ష ప్రారంభించిన తొలిరోజు 53.9 కేజీలు ఉన్న ఆయన 58వ రోజుకు 38.1 కేజీలకు తగ్గారు. 1952 అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 15 వరకు దీక్ష చేశారు. దీక్ష చివరి రోజు ప్రాణాలు వదిలారు. ఈయన పోరాటంతో 1953 OCT 1న కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది.