News March 16, 2025
సబ్బవరం: మినరల్ డీలర్ లైసెన్స్కు దరఖాస్తుల ఆహ్వానం

సబ్బవరం మండలంలో వినియోగదారులకు ఇసుక సరఫరా చేసేందుకు మినరల్ డీలర్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని అనకాపల్లి కలెక్టర్, జిల్లా ఇసుక కమిటీ ఛైర్మన్ విజయ కృష్ణన్ శనివారం తెలిపారు. తూర్పు శ్రీకాకుళం జిల్లాల నుంచి సబ్బవరం ఇసుక కేంద్రానికి ఇసుకను రవాణా చేయడంతో పాటు నిల్వ కేంద్రం నుంచి వాహనాలలో లోడ్ చేయడానికి లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తామన్నారు. వివరాలకు తమ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.
Similar News
News April 17, 2026
నెల్లూరు: వేసవి సెలవుల్లో పిల్లలపై తల్లిదండ్రులు నిఘా తప్పనిసరి

వేసవి సెలవులు వచ్చాయంటే పిల్లలకు ఎక్కడ లేని సంతోషం ఉంటుంది. ఈ సంతోషం సోఖానికి కారణం కాకుండా తల్లిదండ్రులు పిల్లలపై నిఘా ఉంచాలి. ముఖ్యంగా ఎండ ఉపశమనం కోసం స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు చెరువులు, నదులు, బావుల వద్దకు వెళుతుంటారు. ఆ సమయాల్లో ప్రమాదాలు చోటుచేసుకుని మృత్యువాత పడిన సందర్భాలు ఉన్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారని నిత్యం పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది.
News April 17, 2026
శ్రీ సత్యసాయి: రెగ్యులేటర్ ఆపేసి ఉంటే నలుగురు బతికేవారు!

కుమ్మరవాండ్లపల్లి పేలుడు ఘటనలో నిందితులు సమయస్ఫూర్తిని ప్రదర్శించి ఉంటే నాలుగురి ప్రాణాలు నిలబడేవి. గ్యాస్ లీక్ను గమనించిన వెంకన్న ఇంట్లో వారిని తీసుకొని బయటికొచ్చేశాడు. పొగలు కమ్ముకొని ఒత్తిడికి జిలెటిన్ స్టిక్స్ పేలాయి. నిందితులు పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారని, సహాయం చేయడానికి వెళ్లిన అమాయకుల ప్రాణాలు పోయాయని స్థానికులు అంటున్నారు. రెగ్యులేటర్ ఆపేసి ఉంటే నలుగురు బతికేవారని వాపోయారు.
News April 17, 2026
ఖమ్మం: పల్టీ కొట్టిన వరి కోత మిషన్.. డ్రైవర్ మృతి

కల్లూరు మండలం పెద్ద కోరుకొండి శివారులో వరి కోత మిషన్ ప్రమాదవశాత్తు పల్టీ కొట్టడంతో డ్రైవర్ అక్కడే మృతి చెందాడు. స్థానికులు గమనించి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా అప్పటికే డ్రైవర్ మృతి చెందినట్లు గుర్తించారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా స్థానికులు చెప్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


