News March 16, 2025
కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించిన కలెక్టర్

కొమురవెల్లి మండలం గురువన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ద్వారా ఏర్పాటు చేసిన ఎఐ (ఆర్టిఫిషల్ ఇంటిలీజెన్స్) కంప్యూటర్ ల్యాబ్ను జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2002లో ప్రారంభించిన FLN(ఫౌండేషన్ లిటరసీ న్యూమారసి) ప్రోగ్రాం ద్వారా పాఠశాల విద్యార్థుల గణిత, తెలుగు అభ్యసన సామర్ధ్యం పెంచేందుకు కృషి జరుగుతుందన్నారు.
Similar News
News September 18, 2025
అఫ్జల్సాగర్లో గల్లంతు.. భీమలింగం బ్రిడ్జిపై లభ్యం

వలిగొండ (మం) సంగం భీమలింగం బ్రిడ్జిపై గుర్తుతెలియని మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. అఫ్జల్సాగర్ నాలాలో 4రోజుల క్రితం గల్లంతైన అర్జున్ మృతదేహంగా అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి బయలుదేరారు.
News September 18, 2025
HYD: అర్జున్ గల్లంతు.. వలిగొండలో డెడ్బాడీ లభ్యం

అఫ్జల్సాగర్ నాలాలో <<17748449>>4రోజుల<<>> క్రితం గల్లంతైన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరి మృతదేహం లభ్యమైంది. యాదాద్రి జిల్లా వలిగొండ సమీపంలో మూసీ నదిలో అర్జున్ మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు కడసారి చూసేందుకు పిల్లాపాపలతో అక్కడికి బయలుదేరారు. మరో వ్యక్తి ఆచూకీ తెలియరాలేదు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
News September 18, 2025
ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు ఇస్తాం: మంత్రి ఆనం

సంగం మండలం పెరమన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. రూ.5 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వడానికి సీఎం చంద్రబాబు అంగీకారం తెలిపారన్నారు. తక్షణం ఆర్థిక సహాయం ప్రకటించిన సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.