News March 16, 2025

ఈ రోజు నమాజ్ వేళలు

image

మార్చి 16, ఆదివారం ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు సూర్యోదయం: ఉదయం 6.23 గంటలకు దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు అసర్: సాయంత్రం 4.45 గంటలకు మఘ్రిబ్: సాయంత్రం 6.26 గంటలకు ఇష: రాత్రి 7.38 గంటలకు NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News January 13, 2026

పిల్లలకు భోగి పళ్లు పోస్తున్నారా?

image

ఐదేళ్లలోపు చిన్నారులకు ప్రదోష వేళలో తూర్పు ముఖంగా కూర్చోబెట్టి భోగి పళ్లు పోయాలని పండితులు సూచిస్తున్నారు. తల్లి మొదట భోగి పళ్లతో బిడ్డకు 3 సార్లు సవ్యంగా, 3 సార్లు అపసవ్యంగా దిష్టి తీసి ఆపై తల మీద నుంచి పోయాలి. ఇలా చేస్తే నరదోషం తొలగిపోతుందని, నారాయణుడి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. చివరగా పిల్లలకు హారతివ్వాలి. భోగి పళ్లలో ఏమేం ఉండాలి? ఎందుకు పోయాలి? భోగి మంటల ఆవశ్యకత కోసం క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.

News January 13, 2026

రాష్ట్రంలో రూ.3,538 కోట్లతో సోలార్ కాంప్లెక్స్

image

AP: తిరుపతి జిల్లాలోని MP-SEZలో వెబ్‌సోల్ సంస్థ రూ.3,538 కోట్లతో 8GW ఇంటిగ్రేటెడ్ సోలార్ మాన్యుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనుంది. ఇందులో 4GW సోలార్ సెల్స్, 4GW సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్లు ఉంటాయి. 2 దశల్లో 120 ఎకరాల్లో అభివృద్ధి చేసే ఈ ప్రాజెక్టు ద్వారా 2,000 మందికి ఉపాధి లభించనుంది. దీనికి అవసరమైన విద్యుత్ కోసం 300 ఎకరాల్లో 100MW క్యాప్టివ్ సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు.

News January 13, 2026

డయాబెటిస్ భారం.. భారత్‌కు రెండో స్థానం

image

డయాబెటిస్ వల్ల అత్యధిక ఆర్థిక భారం పడుతున్న దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. తాజా అధ్యయనం ప్రకారం ఇండియాపై డయాబెటిస్ కారణంగా 11.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక భారం పడుతోంది. ఈ జాబితాలో US 16.5 ట్రిలియన్ డాలర్లతో టాప్‌లో ఉండగా, 11 ట్రిలియన్ డాలర్లతో చైనా మూడో స్థానంలో ఉంది. వైద్య ఖర్చులు పెరగడం ప్రజల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.