News March 24, 2024
శ్రీకాకుళం: ఇద్దరిని చంపిన ఎలుగుబంటి మృతి?

ఉద్దానం ప్రాంతంలో నిన్న ఎలుగుబంటి ఇద్దరిని చంపిన విషయం తెలిసిందే. జీడితోటకు వెళ్లిన రైతులపై దాడి చేయగా వజ్రపుకొత్తూరు మండలం చీపురుపల్లి పంచాయతీ అనకాపల్లికి చెందిన చిడిపల్లి లోకనాథం(46), అప్పికొండ కూర్మారావు(48) చనిపోయారు. మహిళా రైతు చిడిపల్లి సావిత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇద్దరి మరణానికి కారణమైన ఎలుగుబంటి సమీప తోటల్లో చనిపోయినట్లు సమాచారం.
Similar News
News September 8, 2025
SKLM: కుల బహిష్కరణ చేశారంటూ వ్యక్తి ఆవేదన

ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో తమ కుటుంబాన్ని కులబహిష్కరణ చేశారంటూ ఓ వ్యక్తి కలెక్టరేట్లో ఫిర్యాదు చేశాడు. మెళియాపుట్టి(M) జాడుపల్లికి చెందిన ఓ వ్యక్తి కొన్నేళ్ల క్రితం బెంగాలీ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అనంతరం గ్రామంలో జీవనం సాగిస్తుండగా వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని స్థానికులు ఇప్పటికీ వేధింపులకు గురిచేస్తున్నారని బాధితుడు వాపోయాడు.
News September 8, 2025
శ్రీకాకుళం: విద్యార్థులకు గమనిక

ఏపీ పీజీ సెట్-2025 పరీక్షలకు వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ ఏడాది ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత చెందిన వారు వెబ్ఆప్షన్ ద్వారా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలోని పలు కోర్సుల్లో సీట్లు పొందవచ్చు. ఇతర వివరాలకు సీఈటీఎస్. ఏపీఎస్సీహెచ్సీ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్ సైట్ను చూడవచ్చు. వెబ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు ఈ నెల 8-15 వరకు జరగనుంది.
News September 8, 2025
యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దు: కలెక్టర్

శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం 1600 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం వెల్లడించారు. మరో వారం రోజుల్లో 3 వేల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. తదుపరి విడత ఎరువులు వచ్చే అంచనా తేదీని గ్రామ వ్యవసాయ సహాయకులు, మండల వ్యవసాయ అధికారులు రైతులకు తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు