News March 16, 2025
రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి: అదనపు కలెక్టర్

ఆసుపత్రుల్లో రోగులకు కనీస సౌకర్యాలు కల్పించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సుధీర్ తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో వేసవి నేపథ్యంలో ఫ్యాన్లు, తాగునీరు, మొదలగు సౌకర్యాలు కల్పించాలన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.
Similar News
News March 17, 2026
IPL స్కోర్కార్డ్స్.. ఏది నచ్చింది?

ఐపీఎల్ అంటే ఆట మాత్రమే కాదు.. స్క్రీన్పై కనిపించే స్కోర్కార్డ్ గ్రాఫిక్స్ కూడా స్పెషలే. 2008 నుంచి 2025 వరకు వీటి డిజైన్లు మారుతూ వచ్చాయి. 2014-15 నాటి గ్లాసీ లుక్, 2016 నాటి ఫ్యూచరిస్టిక్ డిజైన్లు ‘బెస్ట్’ అని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే 2011-12 నాటి పాత డిజైన్లు, 2023-24లో వాడిన ఇటాలిక్ ఫాంట్లు అంతగా ఆకట్టుకోలేదంటున్నారు. పాత డిజైన్లకే ఎక్కువ మార్కులు పడుతున్నాయి. ఇంతకీ మీ ఫేవరెట్ ఏది? COMMENT
News March 17, 2026
నల్గొండ: 20న బడ్జెట్.. ఇకనైనా పూర్తి చేస్తారా..!

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లా ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా SLBC సొరంగం పనులు, డిండి ఎత్తిపోతల పథకం పూర్తికి వెయ్యి కోట్ల నిధుల కేటాయింపుపై రైతులు ఎదురుచూస్తున్నారు. అలాగే పెండింగ్లో ఉన్న బ్రాహ్మణ వెల్లంల, ఉదయసముద్రం ప్రాజెక్టులతో పాటు పట్టణాల్లోని సమీకృత మార్కెట్లు, మిని ట్యాంక్ బండ్ల నిర్మాణాలకు నిధులు వస్తాయని ఆశిస్తున్నారు.
News March 17, 2026
GNT: రూ.10 కోట్లతో ఫైనాన్స్ యజమాని పరార్

లక్ష పెడితే నెలకు రూ. 10 వేల లాభమంటూ నమ్మించిన ఓ ఫైనాన్స్ సంస్థ యజమాని వందల మందికి టోకరా వేశాడు. గుంటూరు అరండల్పేటలో ‘ట్రేడ్ దోస్త్’ పేరుతో సంస్థ నడిపిన బాపట్లకు చెందిన వెంకట పూర్ణచంద్రరావు.. ఏజెంట్ల ద్వారా సుమారు రూ. 10 కోట్లు వసూలు చేసి పరారయ్యాడు. ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.


