News March 24, 2024
28న అనంతపురం జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈనెల 28న జరిగే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈనెల 27న జోన్ 4లో మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో బహిరంగ సభ ముగించుకొని, అనంతరం ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. హిందూపురం పార్లమెంట్ పరిధిలోని కదిరిలో ప్రజాగళం, రాప్తాడు, శింగనమల నియోజకవర్గాలలో బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Similar News
News September 9, 2025
అనంత: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 401 అర్జీలు

అనంతపురం జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా వ్యాప్తంగా వచ్చిన సమస్యలపై అర్జీలు ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రజలు ఎంతో నమ్మకంతో తమ సమస్యలపై ఇచ్చిన అర్జీలను నాణ్యమైన రీతిలో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 401 వినతి పత్రాలు వచ్చినట్లు తెలిపారు.
News September 9, 2025
అనంత: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 401 అర్జీలు

అనంతపురం జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా వ్యాప్తంగా వచ్చిన సమస్యలపై అర్జీలు ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రజలు ఎంతో నమ్మకంతో తమ సమస్యలపై ఇచ్చిన అర్జీలను నాణ్యమైన రీతిలో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 401 వినతి పత్రాలు వచ్చినట్లు తెలిపారు.
News September 9, 2025
అనంతపురం జిల్లాలో ట్రాఫిక్ ఆంక్షలు

అనంతపురం జిల్లాకు ఈనెల 10న CBN విచ్చేస్తున్న సందర్భంగా ట్రాఫిక్ మళ్లించినట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ తెలిపారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్లే వాహనాలు అనంతపురం నగరానికి సమీపాన ఉన్న వడియంపేట, బుక్కరాయసముద్రం, నాయనపల్లి క్రాస్, నార్పల క్రాస్, బత్తలపల్లి, ధర్మవరం, ఎన్ఎస్ గేట్ మీదుగా NH-44 జాతీయ రహదారికి మళ్లించినట్లు ఎస్పీ తెలిపారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.