News March 16, 2025

ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య: కలెక్టర్ క్రాంతి

image

ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతుందన సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. పటాన్ చెరు మండలం ముత్తంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం శనివారం నిర్వహించారు. పాఠశాలలో విద్యాబోధన తీరని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులపై ఉందని చెప్పారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Similar News

News March 16, 2025

జగిత్యాల: భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య, కుమారులు

image

JGTLరూరల్(M) పొలాసలో పడాల కమలాకర్(60)ను మొదటిభార్య, కుమారులు పెట్రోల్ పోసి శనివారం నిప్పంటించారు. గాయపడిన కమలాకర్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లగా రాత్రి చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసుల ప్రకారం.. గతంలోనే కమలాకర్ 2 పెళ్లిళ్లు చేసుకున్నాడు. 3వ పెళ్లి చేసుకుని గ్రామంలోనే ఉంటున్నాడు. మద్యంతాగి మొదటి భార్య, కుమారులను వేధించేవాడు. కోపం పెంచుకున్న వారు కమలాకర్‌పై కత్తులతో దాడిచేసి పెట్రోల్ పోసి నిప్పటించారు.

News March 16, 2025

న్యూజిలాండ్‌తో మ్యాచ్.. 91 రన్స్‌కి పాక్ ఆలౌట్

image

న్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చర్చ్‌లో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో పాక్ 91 పరుగులకే ఆలౌటైంది. ఖుశ్‌దిల్ షా(30 బంతుల్లో 32) మాత్రమే ఫర్వాలేదనిపించారు. సల్మాన్ అఘా(18), జహాందాద్ ఖాన్(17) మాత్రమే రెండంకెల స్కోర్ దాటారు. 11 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయిన పాక్ ఏ దశలోనూ కోలుకునేలా కనిపించలేదు. కివీస్ బౌలర్లలో డఫీ 4 వికెట్లు, జేమీసన్ 3, సోధీ 2, ఫౌక్స్ ఒక వికెట్‌ తీశారు.

News March 16, 2025

ఆదిలాబాద్-ఆర్మూర్ లైన్‌కు మోక్షం ఎప్పుడో…?

image

ఆదిలాబాద్-ఆర్మూర్ రైల్వే లైన్ ఏర్పాటుచేయాలని రెండు జిల్లాలకు చెందిన ప్రజలు కోరుతున్నారు. ADB నుంచి నిర్మల్, ఆర్మూర్, నిజామాబాద్‌కు నిత్యం భారీ సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తారు. వెంటనే ADB-ARMR రైల్వే లైన్ తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. అయితే రైల్వే‌లైన్ ఏర్పాటుచేయలేని ప్రభుత్వాలు ఎయిర్‌పోర్టు తెస్తామంటున్నాయని పలు విమర్శలు వినిపిస్తున్నాయి.

error: Content is protected !!