News March 16, 2025
ఈనెల 26న వికారాబాద్లో వాహనాల వేలం: ఎస్పీ

జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో వదిలేసిన, గుర్తుతెలియని 148 వాహనాలకు ఈనెల 26న వేలం వేయనున్నట్లు ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు. జిల్లాలో దొరికిన వాహనాలను వికారాబాద్లో భద్రపరిచామని, పోలీస్ చట్టం 1861లోని సెక్షన్ 26 ప్రకారం ఈ వాహనాలను బహిరంగ వేలం నిర్వహిస్తునట్లు చెప్పారు. మరిన్ని వివరాలకు ఎస్పీ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
Similar News
News March 22, 2026
VZM: విద్యార్థుల భద్రతపై ముందస్తు జాగ్రత్తలు

విజయనగరం జిల్లాలో పదో తరగతి పరీక్షలు కొనసాగుతుండగా.. ఇంటర్ పరీక్షలు పూర్తైన నేపథ్యంలో విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సూచించారు. పరీక్షల అనంతరం ఖాళీ సమయంలో కొంతమంది విద్యార్థులు చెరువులు, కాల్వలు వంటి జలవనరుల వద్దకు వెళ్లే అవకాశముండడంతో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి పిల్లలకు ముందుగానే హెచ్చరికలు ఇవ్వాలని ఆయన కోరారు.
News March 22, 2026
కర్నూలు: ప్రమాదంలో 19 ఏళ్ల యువకుడి మృతి

గోనెగండ్ల మండలం వేముగోడులో మధ్యాహ్నం విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. రవిరెడ్డి పొలంలో కాంట్రాక్టర్ బావన్న నీళ్ల బావిని JCBతో తవ్వుతూ మట్టిని ట్రాక్టర్లో నింపుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో ట్రాక్టర్ ట్రాలీ, ఇంజన్కు మధ్య ఉన్న లింక్ తెగిపోయింది. దీంతో ట్రాక్టర్పై కూర్చున్న సాదిక్ బాషా(19) తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
News March 22, 2026
ఆదిత్య ధర్ క్రికెట్ వదిలేయడానికి కారణం ఇదే!

‘ధురంధర్’ డైరెక్టర్ ఆదిత్య ధర్ భారత్ తరఫున క్రికెట్ ఆడాలని కలలు కన్నారు. తనకు 2002 అండర్-19 WCలో చోటు పక్కా అనుకున్నారు. కానీ అనూహ్యంగా మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ కుమారుడు స్టువర్ట్ బిన్నీని సెలక్ట్ చేశారు. గొప్ప ఫామ్లో ఉన్న తనకు ఛాన్స్ ఇవ్వకుండా రాజకీయాలు చేశారని క్రికెట్కు గుడ్బై చెప్పి సినిమాల్లోకి వచ్చారు. కాగా బిన్నీ ఆ టోర్నమెంటులో 6 మ్యాచుల్లో 34 రన్స్ మాత్రమే చేశారు.


