News March 16, 2025
రాజకీయ చరిత్రలో సీఎం చంద్రబాబు అరుదైన రికార్డు: ఎమ్మెల్యే ఏలూరి

సీఎం చంద్రబాబు ప్రజల ఆశీస్సులతో అరుదైన గౌరవం దక్కించుకున్నారని ఆయన రాజకీయ ప్రయాణం అందరికీ ఆదర్శనీయమన్నారు. అభివృద్ధి, సంక్షేమం, కటోర శ్రమ, సామాజిక న్యాయానికి చంద్రబాబు ప్రతీకని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. సీఎం చంద్రబాబుకు కార్యకర్తలే బలమే శ్రీరామరక్ష అన్నారు. సీఎం చంద్రబాబు శాసనసభలో తొలి ప్రమాణస్వీకారానికి నేటితో 47 ఏళ్లు పూర్తి చేసుకున్నారని, రాజకీయ జీవితం అందరికీ ఆదర్శమన్నారు.
Similar News
News March 13, 2026
ఉగాది ఎప్పుడు? ఆరోజు ఏం చేయాలి?

ఈ ఏడాది మార్చి 19న ఉగాది జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ‘ఆ రోజున 3:45 AM – 5:30 AM మధ్య నిద్రలేవడం శ్రేయస్కరం. నువ్వుల నూనెతో స్నానం చేసి, నూతన వస్త్రాలు ధరించాలి. ఇంటిని మామిడి తోరణాలు, ముగ్గులతోనే కాకుండా వేప కొమ్మలతోనూ అలంకరించడం మంచిది. షడ్రుచుల పచ్చడిని తప్పక తాగాలి. ఇది ప్రకృతి ఇచ్చే కష్టసుఖాలను సమానంగా స్వీకరించే శక్తిని ఇస్తుంది. పంచాంగ శ్రవణంతో రాశిఫలాలు తెలుసుకోవాలి’ అంటున్నారు.
News March 13, 2026
ఎల్లుండి దానధర్మాలు చేస్తే?

MAR 15న సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. దీన్నే మీన సంక్రాంతి అంటారు. ఈ పవిత్రమైన రోజున జపాలు, పుణ్యస్నానాలు ఆచరించాలని పండితులు సూచిస్తున్నారు. ‘గత జన్మ పాపాల నుంచి విముక్తికై ఈరోజు సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. లక్ష్మీనృసింహస్వామికి పాయసం నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున చేసే దానధర్మాలకు విశేష పుణ్యఫలం ఉంటుంది. ఇతరుల శ్రేయస్సు కోరి చేసే ఈ పనులతో కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయి’ అంటున్నారు.
News March 13, 2026
ఆదిలాబాద్ ఎయిర్పోర్టుపై వీడని ఉత్కంఠ

ADB విమానాశ్రయ భూసేకరణ వ్యవహారం గందరగోళంగా మారింది. బ్లూప్రింట్ సిద్ధమైందని నేతలు చెబుతుండగా, తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని కలెక్టర్ స్పష్టం చేయడం చర్చనీయాంశమైంది. రన్వే విస్తరణకు 249.81 ఎకరాలు అవసరం కానుంది. దీంతో భూములు ఎటువైపు పోతాయో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటనతో బాధితుల్లో భయం పెరిగింది. స్పష్టత ఇవ్వాలని ప్రజలు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు.


