News March 16, 2025
రాజకీయ చరిత్రలో సీఎం చంద్రబాబు అరుదైన రికార్డు: ఎమ్మెల్యే ఏలూరి

సీఎం చంద్రబాబు ప్రజల ఆశీస్సులతో అరుదైన గౌరవం దక్కించుకున్నారని ఆయన రాజకీయ ప్రయాణం అందరికీ ఆదర్శనీయమన్నారు. అభివృద్ధి, సంక్షేమం, కటోర శ్రమ, సామాజిక న్యాయానికి చంద్రబాబు ప్రతీకని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. సీఎం చంద్రబాబుకు కార్యకర్తలే బలమే శ్రీరామరక్ష అన్నారు. సీఎం చంద్రబాబు శాసనసభలో తొలి ప్రమాణస్వీకారానికి నేటితో 47 ఏళ్లు పూర్తి చేసుకున్నారని, రాజకీయ జీవితం అందరికీ ఆదర్శమన్నారు.
Similar News
News March 16, 2025
సీఎం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు: MP కావ్య

సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఎంపీ కడియం కావ్య మాట్లాడారు. రాష్ట్రంలో బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిది అన్నారు. ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని కొనియాడారు. తెలంగాణ అభివృద్ధి పదంలో నిలిపేందుకు రేవంత్ రెడ్డి అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు. నియోజకవర్గానికి రూ.800 కోట్లు మంజూరు చేయడం సంతోషకరమన్నారు. 2029లో రాహుల్ గాంధీ పీఎం అవుతారన్నారు.
News March 16, 2025
పెద్దపల్లి: ‘వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి’

సింగరేణి వ్యాప్తంగా మాజ్దూర్ కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్న 103 మందికి గతేడాది 2024- April, mayనెలలకు సంబంధించిన వేతనాలు చెల్లించకపోవడంపై పెద్దపల్లి జిల్లా BJP అధ్యక్షులు కర్రే సంజీవ రెడ్డి, రామగుండం నాయకురాలు కందుల సంధ్యారాణి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. KCP కంపెనీ కార్మికులకు ఏడాదిగా వేతనాలు చెల్లించకపోవడం పట్ల తీవ్ర ఆవేదన చెందుతున్నారన్నారు.
News March 16, 2025
STN: జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం

స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఏర్పాటు చేసిన సభ వేదిక వద్దకు సీఎం రేవంత్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వేదిక వద్ద ఏర్పాటు చేసిన జ్యోతిప్రజ్వల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.