News March 16, 2025
అల్లూరి జిల్లాలో ప్రతీ కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్: DEO

అల్లూరి జిల్లాలో పదో తరగతి పరీక్షలకు 71 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని DEO బ్రహ్మాజీరావు తెలిపారు. జిల్లాలో పలు పరీక్ష కేంద్రాలో ఏర్పాట్లులను శనివారం ఆయన పరిశీలించి, టీచర్స్కు సూచనలు ఇచ్చారు. ప్రతీ కేంద్రంలో ఒక గెజిటెడ్ ఆఫీసర్, మరో సహాయ అధికారి సిట్టింగ్ స్క్వాడ్గా జిల్లా కలెక్టర్ నియమించారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 510మంది ఇన్విజిలేటర్లుని నియమించామన్నారు.
Similar News
News September 18, 2025
కోచింగ్ లేకుండానే టీచర్ అయ్యాడు..!

SRపురం(M) కొత్తపల్లిమిట్టకి చెందిన ప్రభుకుమార్ టీచర్ ఉద్యోగం సాధించాడు. ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. ఇంటి నుంచే ప్రిపేర్ అయ్యాడు. తండ్రి ఏసుపాదం రెండేళ్ల క్రితం చనిపోగా.. తల్లి మణియమ్మ రోజు కూలికి వెళ్లి ఇంటి బాగోగులు చూస్తున్నారు. ఉద్యోగం రావడంతో ఇక అమ్మను కూలి పనులకు పంపకుండా బాగా చూసుకుంటానని ప్రభు కుమార్ తెలిపాడు.
News September 18, 2025
HYD: క్షీణించిన అశోక్ ఆరోగ్యం.. ఆస్పత్రికి తరలింపు

HYDలో నిరుద్యోగ సమితి నాయకులు అశోక్ ఆమరణ నిరాహార దీక్ష 4 రోజులుగా చేస్తుండగా ఆరోగ్యంగా క్షీణించింది. దీంతో ఆయనను వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించినట్లుగా బృందాలు తెలిపాయి. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిందని, జాబ్ క్యాలెండర్ విడుదల చేసే వరకు తన ఆమరణ నిరాహార దీక్ష విరమించేది లేదని తేల్చి చెప్పారు.
News September 18, 2025
NZB: ఎస్ఆర్ఎస్పీ కాలువలో వృద్ధురాలి శవం

ఎస్సారెస్పీ కాలువలో కొట్టుకువచ్చిన ఓ వృద్ధురాలి శవాన్ని జగిత్యాల(D) మల్యాల(M) నూకపల్లి బ్రిడ్జి వద్ద స్థానికులు గుర్తించారు. శవం ముందుకు కొట్టుకుపోకుండా తాళ్లతో కట్టి ఉంచారు. ఆమె నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ గ్రామానికి చెందిన ప్రభావతిగా గుర్తించారు. ఆమెకు మతిస్థిమితం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. సమాచారమందుకున్న పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.