News March 16, 2025
ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు, రాష్ట్రంలోనే టాప్ కరీంనగర్

ఉమ్మడి జిల్లాలో ఎండ దంచికొడుతోంది. శనివారం కరీంనగర్ జిల్లా బూర్గుపల్లిలో 42.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. దీంతో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచింది. అటు రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో 41.5, జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో 41.1, పెద్దపల్లి జిల్లా మంథనిలో 40.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా ఈ ప్రాంతాలు ఆరెంజ్ జోన్లో ఉన్నాయి.
Similar News
News March 17, 2025
రామాయంపేట: అప్పుల బాధతో ఆత్మహత్య

అప్పుల బాధ తాళలేక ఒక యువకుడు పురుగుల మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన రామాయంపేట మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఆరు వెంకటాపూర్ గ్రామానికి చెందిన పుర్ర రమేష్ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గత సోమవారం ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు సేవించారు. బంధువులు ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు.
News March 17, 2025
పెద్దపల్లి జిల్లాలో భగ్గుమంటున్న భానుడు

వేసవి నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. సోమవారం కాల్వ శ్రీరాంపూర్ మండలంలో సరాసరి గరిష్ఠ ఉష్ణోగ్రత 40.9℃గా నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అటు చలి తీవ్రత కూడా తగ్గడంతో ఓదెల మండలంలో 18.0℃ సరాసరి కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, ఇప్పటికే జిల్లా ప్రజలు ఉక్కుపోతతో ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో వేడి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోంది.
News March 17, 2025
GOLD: ప్రాఫిట్ బుకింగ్ టైమ్ వచ్చేసిందా!

చివరి మూడేళ్లలో ఏటా బంగారం 17% రాబడి అందించింది. ఔన్స్ రేటు $3000ను తాకడంతో ప్రాఫిట్ బుక్ చేసుకోవడంపై ఇన్వెస్టర్లు సందిగ్ధంలో పడ్డారు. Sensex to Gold రేషియోను బట్టి నిర్ణయించుకోవడం బెటర్ అంటున్నారు Edelweiss SVP నిరంజన్ అవస్థి. 1999 నుంచి ఈ రేషియో 1కి దిగువన ఉంటే తర్వాతి మూడేళ్లలో ఈక్విటీస్, 1 కన్నా ఎక్కువుంటే తర్వాతి మూడేళ్లలో గోల్డ్ రాణిస్తోంది. ప్రస్తుతమిది లాంగ్టర్మ్ సగటు 0.96కు దిగువన ఉంది.