News March 16, 2025

నర్సీపట్నం: జీవితం  మీద విరక్తితో ఆత్మహత్య

image

నర్సీపట్నం మండలం నీలం పేట గ్రామానికి చెందిన పెట్ల నూకయ్య నాయుడు అనే వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నట్లు రూరల్ ఎస్ఐ రాజారావు తెలిపారు. ఆయన గత కొద్దికాలంగా డయాబెటిస్ తదితర అనారోగ్యంతో బాధపడుతున్నాడని అన్నారు. దీంతో జీవితం మీద విరక్తి చెంది పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ శనివారం మరణించాడని పేర్కొన్నారు.

Similar News

News April 16, 2026

అనకాపల్లి: విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు నిరంతరం శ్రమించాలి

image

విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు నిరంతరం శ్రమించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో ఇంటర్ ఫలితాలపై సమీక్ష నిర్వహించారు. ఫెయిల్ అయిన సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. తక్కువ ఉత్తీర్ణత నమోదైన కళాశాలల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్న నేపాథ్యంలో ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు.

News April 16, 2026

అల్లూరి: తండ్రి ఆటో డ్రైవర్.. కుమారుడు జిల్లా టాపర్

image

ఎటపాక మండలం గన్నవరం గ్రామానికి చెందిన జయరామకృష్ణ CBSE పదోతరగతి పరీక్షా ఫలితాల్లో 500/478 సాధించి ఉమ్మడి అల్లూరి జిల్లాకు టాపర్‌గా నిలిచాడని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాంగదయ్య తెలిపారు. జయరామకృష్ణ చింతూరు ఏకలవ్య పాఠశాలలో చదువుతున్నాడు. తండ్రి పరమయ్య ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ, కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తమ కుమారుడు జిల్లా టాపర్‌గా రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

News April 16, 2026

తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్‌తో పోలుస్తావా?.. హరీశ్‌రావు ఫైర్

image

పార్లమెంట్‌లో TG ఏర్పాటుపై BJP MP తేజస్వీ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్‌తో పోలుస్తావా?, దశాబ్దాల పోరాటం, ఎంతో మంది త్యాగాల ఫలితమైన అలాంటి మహోద్యమాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం అమరుల త్యాగాలను తక్కువ చేసి చూపించడమే.. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించిన తేజస్వీ క్షమాపణలు చెప్పాలి’ అని ట్వీట్ చేశారు.