News March 16, 2025
ఇచ్ఛాపురం: కరెంటు స్తంభాన్ని ఢీకొని వ్యక్తి మృతి

ఇచ్ఛాపురం మండలం కొలిగాం గ్రామ సమీప మలుపు వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బిహార్కు చెందిన రాజేశ్ ఓ ఇటుకుల కంపెనీలో పనిచేస్తున్నాడు. పని ముగించుకుని మరో వ్యక్తితో బైక్పై అతివేగంగా వస్తూ.. కరెంటు స్తంభాన్ని ఢీ కొన్నారు. ఈ ప్రమాదంలో రాజేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసులు గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్నారు.
Similar News
News March 14, 2026
శ్రీకాకుళం: ఫోటోల అశ్లీల మార్ఫింగ్ చేసిన విద్యార్థిపై కేసు

శ్రీకాకుళం రూరల్ పరిధి మునసబుపేటలోని ఓ ప్రైవేట్ కళాశాలలో విద్యార్థినిల ఫోటోల అశ్లీల మార్ఫింగ్ అంశంలో అసలెంత మంది పాత్ర ఉందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనల నేపథ్యంలో ప్రిన్సిపల్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. కళాశాలలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిపై కేసు నమోదైంది. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపడితే మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి.
News March 14, 2026
శ్రీకాకుళం: టెన్త్ పరీక్షా కేంద్రం తెలుసుకోవాలా..QR కోడ్ మీ కోసమే

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ నెల 16న ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం విద్యార్థులకు కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిందని శ్రీకాకుళం DEO ఎ. రవిబాబు శుక్రవారం తెలిపారు. పరీక్ష కేంద్రాలను తెలుసుకునేందుకు విద్యార్థులు ఇబ్బంది పడకుండా హాల్టికెట్లపై (QR) కోడ్ను అందిస్తున్నామన్నారు. మొబైల్లో దీన్ని స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం చిరునామా, రూట్ మ్యాప్, పాఠశాల చిత్రం కనిపిస్తాయని పేర్కొన్నారు.
News March 14, 2026
ధాన్యం కొనుగోలుకు ఈనెల 28 లాస్ట్ డేట్: జేసీ

ప్రభుత్వ పరంగా రైతులు వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఈనెల 28 ఆఖరి తేదీ అని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఫర్మాన్ ఖాన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ధాన్యం అమ్మాలనుకున్న రైతులు మీ ప్రాంతాల్లో గల రైతు సేవ కేంద్రాల్లో గల సిబ్బందిని లేదా మండల వ్యవసాయ శాఖ అధికారిని పైన తెలిపిన తేదీలోగా సంప్రదించాలని ఆయన తెలిపారు.


