News March 16, 2025
పార్వతీపురం: 67 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు

పార్వతీపురం మన్యం జిల్లాలో సోమవారం నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామని DEO ఎన్.తిరుపతి నాయుడు వెల్లడించారు. ఆయన వివరాల ప్రకారం.
➤ జిల్లాలో మొత్తం ఎగ్జాం సెంటర్లు: 67
➤ పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్య: 10,455
➤ ఫ్లైయింగ్ స్క్వాడ్లు: 03
➤ సిట్టింగ్ స్క్వాడ్లు: 06
➤ కస్టోడియన్ సిటింగ్ స్క్వాడ్లు: 22
☞ అందరికీ Way2News తరఫున All The Best
Similar News
News January 12, 2026
విజయ్పై సీబీఐ ప్రశ్నల వర్షం

కరూర్ తొక్కిసలాటపై TVK చీఫ్ విజయ్పై CBI ప్రశ్నల వర్షం కురిపించింది. ‘బహిరంగ సభకు ఆలస్యంగా ఎందుకు వచ్చారు? రాజకీయశక్తిని ప్రదర్శించడం కోసమే అలా చేశారా? జనసమూహంలో కారు నుంచి ఎందుకు బయటకు వచ్చారు? సభలో ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నా మీరెందుకు ప్రసంగం కొనసాగించారు? నీళ్ల బాటిళ్లను ఎందుకు పంపిణీ చేశారు?’ అని ప్రశ్నించింది. ర్యాలీకి ముందు పార్టీ నేతలతో సమావేశాలపైనా ఆరా తీసింది.
News January 12, 2026
సంక్రాంతి.. HYD దాటిన 7 లక్షల వాహనాలు

సంక్రాంతి వేళ HYD నుంచి స్వగ్రామాలకు జనం క్యూ కట్టారు. ఈ సారి 12 లక్షల వాహనాలు HYD దాటనున్నట్లు అంచనా వేయగా.. ఇప్పటికే సుమారు 7 లక్షల వాహనాలు HYD దాటినట్లు వివిధ శాఖల అధికారులు తెలిపారు. ప్రతి 20 కిలోమీటర్లకు అంబులెన్స్, ఆగిన వాహనాల తరలింపునకు క్రేన్లు, భద్రత కోసం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. టోల్ గేట్ల వద్ద ప్రత్యేక చర్యలు తీసుకోవాలనే ఆదేశాలు ఉన్నాయి.
News January 12, 2026
ఉద్యోగం భద్రంగా ఉండాలంటే?

ఏ సంస్థలైనా తక్కువతో ఎక్కువ లాభం వచ్చే వనరులపైనే ప్రధానంగా దృష్టి పెడతాయి. కాబట్టి ఎలాంటి స్థితిలోనైనా బాధ్యత తీసుకునే తత్వం ఉండాలి. పలానా వ్యక్తి పనిచేస్తే పక్కాగా ఉంటుందనే పేరును తెచ్చుకోవాలి. ఇది ఒక్కరోజులో వచ్చేది కాదు కాబట్టి దానికోసం శ్రమించాలి. పని గురించి అప్డేట్గా ఉండాలి. ఎన్ని బాధ్యతలున్నా మరీ ఎక్కువగా సెలవులు పెట్టకూడదు. ఆఫీసుకు వెళ్లేది పనిచేసేందుకే కాబట్టి దానిపై దృష్టి పెట్టాలి.


