News March 16, 2025
నేడు జనగామ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి నేడు జనగామ జిల్లాకు రానున్నారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో నిర్వహించనున్న ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొననున్నారు. ఈ సభకు 50వేలకు పైనే జనాలు వచ్చేట్లుగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, ఘన్పూర్లో దాదాపు రూ.800 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయనున్నారు. మ. ఒంటిగంటకు హెలిపాడ్ వద్దకు రేవంత్ చేరుకోనున్నారు.
Similar News
News January 8, 2026
సంక్రాంతికి ఈ రూట్లో స్పెషల్ రైళ్లు

సంక్రాంతి రద్దీ దృష్ట్యా బెంగళూరు కంటోన్మెంట్, కలబురగి మధ్య స్పెషల్ ట్రైన్లను నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) ప్రకటించింది. ఈనెల 10 నుంచి మార్చి 1 వరకు రానుపోను 16 సర్వీసులు (ట్రైన్ నం.06207/06208) ఉంటాయని వెల్లడించింది. యెలహంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్, ఆదోని, మంత్రాలయం, రాయిచూర్, కృష్ణా, యాద్గిర్, వాడి, షాహాబాద్ స్టేషన్లలో ఈ ట్రైన్లు ఆగుతాయని తెలిపింది.
News January 8, 2026
నదీ గర్భంలో రాజధాని కట్టట్లేదు: నారాయణ

AP: నదీ గర్భంలో రాజధాని కట్టట్లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. జగన్ రెండో దశ భూసేకరణపై చేసిన <<18799615>>కామెంట్ల<<>>పై స్పందించారు. ‘YCP ఎన్ని ప్రయత్నాలు చేసినా అమరావతి ఆగదు. తప్పుడు ప్రచారం చేస్తే ఈసారి ఆ 11 సీట్లు కూడా రావు. 2వ విడత భూసేకరణలో భాగంగా భూమి ఇవ్వడానికి రైతులు ముందుకొస్తున్న టైంలో ఇలాంటి కామెంట్స్ చేయడం దారుణం. CMగా పని చేసిన వ్యక్తి ప్రజలను పక్కదోవ పట్టించడం సరికాదు’ అని మండిపడ్డారు.
News January 8, 2026
IT కారిడార్లో అర్ధరాత్రి బేఫికర్!

ఆఫీసు నుంచి ఆలస్యంగా వచ్చే టెక్కీలైనా, రాత్రివేళ నడిచే సామాన్యులైనా చీకటి గల్లీల్లో అడుగు వేయాలంటే భయం. ఈ భయాన్ని పోగొట్టడానికే శేరిలింగంపల్లిలో రూ.50 కోట్లతో జీహెచ్ఎంసీ కొత్త వెలుగులు నింపుతోంది. కేవలం లైట్లు వేయడమే కాదు.. అవి ఐదేళ్ల పాటు వెలిగేలా గ్యారెంటీ బాధ్యత కూడా కాంట్రాక్టరుదేనని అధికారులు తెలిపారు. దీంతో మన రోడ్లపై రాత్రిపూట కూడా సురక్షితంగా, ధీమాగా తిరిగే భరోసా లభిస్తుంది.


