News March 16, 2025

కాకినాడ: కన్నతండ్రే కిల్లర్‌లా చంపేశాడు..!

image

కన్నతండ్రే కిల్లర్‌లా ఇద్దరు చిన్నారులను చంపేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన కాకినాడలో జరిగిన విషయం తెలిసిందే. చంద్రకిశోర్ ఇద్దరి చిన్నారులను ప్రముఖ స్కూల్‌లో చదివిస్తున్నాడు. భవిష్యత్తులో లక్షలు కట్టి చదివించగలనా? అనే భయం మొదలైందని బంధువులు చెబుతున్నారు. ఒకేసారి ఇద్దరు పిల్లలకు కాళ్లుచేతులకు తాళ్లు ఎలా కట్టగలిగాడు? వారిని బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లి ఎలా చంపగలిగాడనేది అనుమానంగా ఉందని వారు చెప్పారు.

Similar News

News March 16, 2025

పెద్దపల్లి: ‘వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి’

image

సింగరేణి వ్యాప్తంగా మాజ్దూర్ కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్న 103 మందికి గతేడాది 2024- April, mayనెలలకు సంబంధించిన వేతనాలు చెల్లించకపోవడంపై పెద్దపల్లి జిల్లా BJP అధ్యక్షులు కర్రే సంజీవ రెడ్డి, రామగుండం నాయకురాలు కందుల సంధ్యారాణి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. KCP కంపెనీ కార్మికులకు ఏడాదిగా వేతనాలు చెల్లించకపోవడం పట్ల తీవ్ర ఆవేదన చెందుతున్నారన్నారు.

News March 16, 2025

STN: జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం

image

స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఏర్పాటు చేసిన సభ వేదిక వద్దకు సీఎం రేవంత్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వేదిక వద్ద ఏర్పాటు చేసిన జ్యోతిప్రజ్వల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News March 16, 2025

సంక్షేమ పథకాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

image

స్టేషన్ ఘనపూర్‌లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి రూ.800 కోట్ల విలువ గల పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను డిజిటల్ విధానంలో ప్రారంభించారు. వారు ప్రారంభించిన వాటిలో 100 పడకల ఆసుపత్రి, స్కూల్స్, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో పాటు పలు కాలువలు, బంజారా భవన్, మహిళ శక్తి బస్సులు లాంటి సంక్షేమ పతకాలున్నాయి. మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, పలువురు ఎమ్మెల్యేలు తదితరులున్నారు.

error: Content is protected !!