News March 16, 2025
NGKL: అయ్యో పాపం.. చిన్నారి మృతి

బల్మూరు మండలం చిన్నారి సంపులో పడి మృతిచెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. కొండనాగులకి చెందిన చింత మహేశ్, సుస్మిత దంపతులకు చిన్నారి నాన్సీ(2) ఉంది. ఆడుకుంటూ పక్కింటికి వెళ్లింది. చిన్నారిని ఎవరూ గమనించకపోవటంతో ఇంటి ఎదుట ఉన్న సంపులో పడింది. కొంత సేపటికి గమనించిన కుటుంబసభ్యులు చిన్నారిని బయటికి తీయగా అప్పటికే మృతిచెందింది.
Similar News
News March 16, 2025
భద్రత పెంపుపై సీఎం ఆలోచించాలి: డీకే అరుణ

TG: తన ఇంట్లోకి <<15780375>>ఆగంతకుడు<<>> ఎందుకు ప్రవేశించాడో తెలియలేదని ఎంపీ డీకే అరుణ చెప్పారు. హాల్, కిచెన్, బెడ్ రూమ్లో సెర్చ్ చేశాడని, ఎలాంటి వస్తువులు దొంగిలించలేదని వెల్లడించారు. తన భర్తకు ఇప్పటివరకు ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వలేదన్నారు. గతంలో తన నాన్నపై దాడి జరిగిందని, భద్రత పెంపుపై సీఎం రేవంత్ ఆలోచించాలని కోరారు. ఈ ఘటనతో తన కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.
News March 16, 2025
స్వశక్తితో బతకడంతో మహిళల ఆత్మగౌరవాన్ని పెంచుతుంది: DGP

రాచకొండ పోలీస్ కమిషనరేట్, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మహిళలకు ప్రత్యేకంగా ఉద్యోగ మేళా నిర్వహించారు. డీజీపీ జితేందర్ ఐపీఎస్ మాట్లాడుతూ.. స్వశక్తితో బ్రతకడం ద్వారా మహిళల ఆత్మగౌరవం మరింత పెరుగుతుందని అన్నారు. సీపీ సుధీర్ బాబు ఐపీఎస్ సమానత్వమే మహిళలకు ఇచ్చే నిజమైన గౌరవమని అన్నారు. ఈ మేళాలో అనేక సంస్థలు పాల్గొని ఉద్యోగ అవకాశాలను అందించాయి.
News March 16, 2025
బోధన్: షుగర్ ఫ్యాక్టరీని పరిశీలించిన రాష్ట్ర మంత్రి

బోధన్ షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు రైతులతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు మహారాష్ట్రలోని సాంగ్లీ తాలూకాలో చెరుకు పంటలను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి మంత్రివర్యులు శ్రీధర్ బాబు, మాజీ మంత్రివర్యులు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, సాంగ్లీలోని శ్రీదత్త షుగర్ ఫ్యాక్టరీ ఛైర్మన్ శ్రీగణపతి రావు పాటిల్, నాయకులు పాల్గొన్నారు.