News March 16, 2025

ఖానాపూర్: బస్సును ఢీ కొట్టిన ఆటో.. తర్వాత ఏమైందంటే?

image

WGL జిల్లా ఖానాపూర్ మండలం పాకాల చెరువు సమీపంలో నర్సంపేట నుంచి కొత్తగూడ వెళ్తున్న RTC బస్సును చిలుకమ్మ నగర్ వైపు నుంచి నర్సంపేటకు వస్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్, కండక్టర్ కిందికి దిగి చూడగా ఆటోలో అడవి పంది మాంసం, చనిపోయిన కొండ గొర్రెను చూశారు. భయపడిన ఆటోలోని నలుగురు వ్యక్తులు కొండగొర్రెను అక్కడే వదిలేసి అటోతో సహా పరారయ్యారు.

Similar News

News March 16, 2025

భారత త్రో బాల్ జట్టుకు ఎంపికైన వెన్నపూస రోషీ రెడ్డి

image

భారత త్రో బాల్ జట్టుకు అనంతపురానికి చెందిన వెన్నుపూస రోషీ రెడ్డి ఎంపికయ్యారు. భారత పారా త్రో బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఆల్బర్ట్ ప్రేమ్ కుమార్ ఎంపికైన లేఖను పంపించినట్లు రోషీ రెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా దివ్యాంగుల క్రికెట్ సంఘం అధ్యక్షులు డాక్టర్ శంకర్ నారాయణ అతడిని అభినందించారు. కంబోడియాలో జరిగే ఆసియా పారా త్రోబాల్ టోర్నమెంట్లో భారత జట్టు తరపున ఆడనున్నారు.

News March 16, 2025

భద్రత పెంపుపై సీఎం ఆలోచించాలి: డీకే అరుణ

image

TG: తన ఇంట్లోకి <<15780375>>ఆగంతకుడు<<>> ఎందుకు ప్రవేశించాడో తెలియలేదని ఎంపీ డీకే అరుణ చెప్పారు. హాల్, కిచెన్, బెడ్ రూమ్‌లో సెర్చ్ చేశాడని, ఎలాంటి వస్తువులు దొంగిలించలేదని వెల్లడించారు. తన భర్తకు ఇప్పటివరకు ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వలేదన్నారు. గతంలో తన నాన్నపై దాడి జరిగిందని, భద్రత పెంపుపై సీఎం రేవంత్ ఆలోచించాలని కోరారు. ఈ ఘటనతో తన కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.

News March 16, 2025

స్వశక్తితో బతకడంతో మహిళల ఆత్మగౌరవాన్ని పెంచుతుంది: DGP

image

రాచకొండ పోలీస్ కమిషనరేట్, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మహిళలకు ప్రత్యేకంగా ఉద్యోగ మేళా నిర్వహించారు. డీజీపీ జితేందర్ ఐపీఎస్ మాట్లాడుతూ.. స్వశక్తితో బ్రతకడం ద్వారా మహిళల ఆత్మగౌరవం మరింత పెరుగుతుందని అన్నారు. సీపీ సుధీర్ బాబు ఐపీఎస్ సమానత్వమే మహిళలకు ఇచ్చే నిజమైన గౌరవమని అన్నారు. ఈ మేళాలో అనేక సంస్థలు పాల్గొని ఉద్యోగ అవకాశాలను అందించాయి.

error: Content is protected !!