News March 16, 2025
అనకాపల్లి: జిల్లాలో పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

అనకాపల్లి జిల్లాలో ఈనెల 17 నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో అప్పారావు నాయుడు తెలిపారు. జిల్లాలో 107 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 22,042 మంది పరీక్షలకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. వీరిలో బాలికలు 10,968 మంది, బాలురు 11,074 మంది ఉన్నట్లు తెలిపారు. 31 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. రోజు ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుందన్నారు.
Similar News
News March 8, 2026
NLG: ఆర్టీసీ ప్రగతి చక్రంలోనూ నారీశక్తి..!

TG-RTC అభ్యున్నతిలో మహిళా ఉద్యోగులు సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల పరిధిలో మహిళా సిబ్బంది తమ పనితీరుతో సంస్థకు ఆదాయ వనరులుగా మారారు. 7 డిపోలలో కలిపి మొత్తం 328 మంది మహిళలు విధుల్లో ఉన్నారు. వీరిలో 308 మంది కేవలం కండక్టర్లుగానే సేవలందిస్తూ బస్సులను లాభాల బాటలో నడిపిస్తున్నారు. అత్యధికంగా నల్గొండ డిపోలోనే 80 మంది మహిళా కండక్టర్లు పనిచేస్తుండటం విశేషం.
News March 8, 2026
CA ఫలితాలు విడుదల

ఛార్టర్డ్ అకౌంటెన్సీ(CA) ఫలితాలను ICAI రిలీజ్ చేసింది. ఫౌండేషన్, ఇంటర్ పరీక్షల రిజల్ట్స్ను <
News March 8, 2026
బోరవెల్లి ‘కవిపోషక రాణి’ గిరియమ్మ

రాజకుమారి గిరియమ్మ బోరవెల్లి కోట సంస్థాన చినసోమభూపాలుడి భార్య. సంతానం లేకపోవడంతో పెద్దసోమభూపాలుని కుమారుడు వెంకటపతిని దత్తత తీసుకున్నారు. గద్వాల కవులు-పండితులను పోషించి కవిపోషక రాణిగా పేరు తెచ్చుకున్నారు. దత్తపుత్రుడు వెంకటపతి కూడా తల్లికి తగ్గట్టుగా సాహిత్యాన్ని ఆదరించారు. 1668లో వెంకటపతి సంస్థానాన్ని గద్వాలలో విలీనం చేసి తన పుట్టినిల్లు గద్వాల సంప్రదాయాన్ని బోరవెల్లిలో తెచ్చి కీర్తిని తెచ్చారు.


