News March 16, 2025

వరంగల్‌లో కిలాడి లేడీ అరాచకాలు

image

వరంగల్‌లో ఓ కిలాడీ లేడీ అరాచకాలకు పోలీసులు చెక్ పెడుతున్నారు. పాఠశాలకు వెళ్లే బాలికలను టార్గెట్ చేసి వారిని కిడ్నాప్ చేసి డ్రగ్స్ ఇస్తున్నారు. ఆ తర్వాత వారిపై అత్యాచారాలు చేయించి, స్పృహలో రాగానే ఎక్కడ కిడ్నాప్ చేశారో.. అక్కడ వదిలి వెళ్తున్నారు. ఓ బాలిక మిస్సింగ్ కేసుతో ఈ విషయం బయటపడింది. ఆ కిలాడీకి మరో నలుగురు యువకులు సహాయపడుతున్నట్లు తెలుస్తోంది. వారు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

Similar News

News January 5, 2026

వరిలో జింకు లోపాన్ని ఎలా నివారించాలి?

image

వరి తర్వాత తిరిగి వరినే పండించే నేలలో ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్‌ను ప్రతి రబీ పంటకు ముందు దమ్ములో వేసి పైరులో జింకు లోపం ఏర్పడకుండా నివారించవచ్చు. భాస్వరం ఎరువులు వేయడానికి 2 రోజుల ముందు జింకు సల్ఫేట్ వేయాలి. పైరుపై జింకు లోపం కనిపిస్తే ఒక ఎకరానికి 400 గ్రాముల జింకు సల్ఫేట్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి వరి ఆకులు మొత్తం తడిచేలా.. నిపుణుల సూచనలతో వారం వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి.

News January 5, 2026

అనంతలో ఆలయం తొలగింపు వివాదం.. రంగంలోకి హిజ్రాలు

image

కోర్టు ఆదేశాలతో అనంతపురంలోని కుక్కలపల్లి కాలనీ వద్ద ఉన్న శ్రీ నరిగమ్మ ఆలయ తొలగింపునకు ఆదివారం రెవెన్యూ, పోలీసులు యత్నించారు. అయితే BJP, VHP నాయకులు నిరసన తెలిపారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విగ్రహాలను కొత్తగా నిర్మించిన ఆలయంలోకి అధికారులు మార్చారు. అయితే BJP నాయకులు హిజ్రాలను రంగంలోకి దింపారు. తరలించిన విగ్రహాలను వారు యథాస్థానానికి చేర్చారు. పూజలు చేస్తూ తరలింపును అడ్డుకున్నారు.

News January 5, 2026

అవయవదానం ఫ్యామిలీకి రూ.లక్ష!

image

AP: అవయవదానం చేసిన జీవన్మృతుల కుటుంబాలకు రూ.లక్ష అందజేయాలని సీఎంకు మంత్రి సత్యకుమార్ ప్రతిపాదనలు పంపారు. దీంతో బాధిత కుటుంబాలకు ఆర్థిక బలం చేకూరడంతో పాటు అవయవదానాన్ని ప్రోత్సహించినట్లు అవుతుందని పేర్కొన్నారు. అలాగే ఫ్యామిలీలో ఒకరికి ప్రభుత్వ తాత్కాలిక ఉద్యోగం కల్పిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. గతేడాది 93మంది జీవన్మృతుల నుంచి అవయవాలు తీసుకొని 301 మందికి అమర్చినట్లు మంత్రి చెప్పారు.