News March 16, 2025
పెద్దపల్లి: 30న అఖిల భారత యాదవ మహాసభ

ఈనెల 30వ తేదీన అఖిల భారత యాదవ మహాసభ నిర్వహించనున్నట్లు యాదవ సంఘం నాయకులు శనివారం వెల్లడించారు. ఈ మేరకు పెద్దపల్లి పట్టణంలో మీడియాతో మాట్లాడారు. మహాసభలో యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. పురస్కారాల కోసం ఆసక్తి ఉన్నవారు ఈనెల 23వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, అలాగే మహాసభను విజయవంతం చేయాలని కోరారు.
Similar News
News March 25, 2026
పశ్చిమాసియా యుద్ధంపై ప్రకాశ్ రాజ్ సెటైర్

US-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంపై నటుడు ప్రకాశ్ రాజ్ సెటైర్ వేశారు. ‘యుద్ధం లక్ష్యం ఇప్పుడు “హార్ముజ్” జలసంధిని తెరవడం వైపు మళ్లినట్లు కనిపిస్తోంది. నిజానికి యుద్ధం మొదలవ్వకముందు అది తెరిచే ఉంది’ అని లాఫింగ్ ఎమోజీతో ఆయన ట్వీట్ చేశారు. కాగా తమతో శత్రుత్వం లేని దేశాల నౌకలు హార్ముజ్ నుంచి రాకపోకలు కొనసాగించవచ్చని ఇరాన్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
News March 25, 2026
పల్నాడు: ఎమ్మెల్యేలకు టెన్షన్ స్టార్ట్..!

నియోజకవర్గాల పునర్విభజన అంశం పల్నాడు జిల్లా ఎమ్మెల్యేల్లో గుబులు రేపుతోంది. ప్రస్తుతం 7గా ఉన్న అసెంబ్లీ స్థానాలు 11కి పెరిగే అవకాశం ఉండటంతో, రిజర్వేషన్ల మార్పుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు ఎవరి సీటుకు ఎసర పెడతాయోనని నేతలు ఆందోళన చెందుతున్నారు. తారుమారయ్యే మండలాలపై పట్టు సాధించడం ఇప్పుడు అభ్యర్థులకు కత్తిమీద సాములా మారింది.
News March 25, 2026
కాంగ్రెస్కు గుడ్బై.. 7000 మందితో BRSలోకి జీవన్రెడ్డి?

మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్కు నేడు ఆయనతో పాటు సుమారు 7000 మంది అనుచరులు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారిన 10 మంది MLAలను టార్గెట్గా చేసుకొని వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామంతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశముంది. వచ్చేనెల 5 నుంచి 10లోపు భారీ సభలో మాజీ CM KCR సమక్షంలో BRSలో చేరనున్నట్లు సమాచారం.


