News March 16, 2025
పార్వతీపురం: ‘పొట్టి శ్రీరాములు జీవితం చిరస్మరణీయం’

అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం చిరస్మరణీయమని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఎ. శ్యాం ప్రసాద్ అన్నారు. పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో BC సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి చిత్రపటానికి పూలమాలలు వేశారు.
Similar News
News March 27, 2026
పెళ్లయిన వ్యక్తి మరొకరితో సహజీవనం నేరం కాదు: అలహాబాద్ హైకోర్టు

పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం నేరం కాదని అలహాబాద్ హైకోర్టు ఇటీవల వ్యాఖ్యానించింది. నైతికత, చట్టం వేర్వేరు అని పేర్కొంది. చట్టం ప్రకారం నేరం రుజువు కానప్పుడు పౌరుల హక్కులను పరిరక్షించడంలో న్యాయస్థానం తీసుకునే చర్యలను సామాజిక అభిప్రాయాలు, నైతికత నిర్దేశించలేవంది. లివ్-ఇన్ రిలేషన్లో ఉన్న జంట రక్షణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ కామెంట్లు చేసింది.
News March 27, 2026
MBNR: అంబేద్కర్ వర్సిటీ పీజీ పరీక్షల షెడ్యూల్ విడుదల

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ మొదటి సంవత్సరం 2025 – 26 పరీక్షల షెడ్యూల్ విడుదల అయినట్లు మహబూబ్ నగర్ ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా కె పద్మావతి పేర్కొన్నారు. పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు మేలో ఉంటాయని టైం టేబుల్ వెబ్ సైట్లో ఉందని తెలిపారు. పరీక్షకు సంబంధించిన ఫీజు చెల్లింపునకు ఏప్రిల్ 13వ తేదీ వరకు ఆకాశం ఉందని రీజినల్ కోఆర్డినేటర్ డా జి సత్యనారాయణ గౌడ్ వెల్లడించారు.
News March 27, 2026
తిరుపతి జిల్లాలో భారీ మార్పులు

తిరుపతి జిల్లాలో భారీ మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. జనాభా ప్రాతిపదికన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో డివిజన్లు, వార్డులు పెరగనున్నాయి. వీటితో పాటు 25నుంచి 30వరకు పంచాయతీలు పెరిగేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహులు కూడా పెరిగారు. రిజర్వేషన్లపై క్లారిటీ వస్తే పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది.


