News March 16, 2025

పెద్దపల్లి: ‘వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి’

image

సింగరేణి వ్యాప్తంగా మాజ్దూర్ కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్న 103 మందికి గతేడాది 2024- April, mayనెలలకు సంబంధించిన వేతనాలు చెల్లించకపోవడంపై పెద్దపల్లి జిల్లా BJP అధ్యక్షులు కర్రే సంజీవ రెడ్డి, రామగుండం నాయకురాలు కందుల సంధ్యారాణి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. KCP కంపెనీ కార్మికులకు ఏడాదిగా వేతనాలు చెల్లించకపోవడం పట్ల తీవ్ర ఆవేదన చెందుతున్నారన్నారు.

Similar News

News March 18, 2025

ఎప్పుడూ నీరసం, అలసటగా ఉంటుందా?

image

కొందరికి ఎలాంటి శారీరక, మానసిక శ్రమ చేయకపోయినా నీరసం, అలసట వస్తుంది. దీనికి అనేక కారణాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటే దీనిని నివారించవచ్చు. శరీరంలో తగినంత ఐరన్ లేకపోతే ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఉదయం ఏదో ఒక ఆహారం తింటే నీరసం, అలసట ఉండదు. లంచ్‌లో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలి. రోజూ తగినన్ని నీళ్లు తాగాలి. వారంలో ఒకరోజుకు మించి ఉపవాసం చేయకూడదు.

News March 18, 2025

నల్గొండ: ప్రతి గ్రామానికి ఒక పోలీస్ అధికారి: SP

image

జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి, ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి ప్రతి గ్రామానికి ఒక పోలీస్ అధికారిని నియమిస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. సోమవారం పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప్రతి గ్రామంలో వీపీవో క్రమం తప్పకుండా సందర్శించి, ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యల పరిష్కార దిశగా కృషి చేయాలని సూచించారు.

News March 18, 2025

సిద్దిపేట: కుష్టు రహిత సమాజాన్ని నిర్మిద్దాం: DMHO

image

కుష్టు రహిత సమాజాన్ని నిర్మిద్దామని డీఎంహెచ్ఓ పల్వాన్ కుమార్ అన్నారు. జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ అరుణ్ కుమార్ అధ్యక్షతన జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కుష్టు రహిత సమాజాన్ని నిర్మించేందుకు జిల్లాలో మార్చి 17 నుంచి 30 వరకు క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తల ద్వారా ఇంటింటికి వెళ్లి కుష్టు వ్యాధి లక్షణాలున్న వారిని ముందస్తుగా గుర్తించి వైద్యం అందించనున్నట్లు తెలిపారు.

error: Content is protected !!