News March 16, 2025

అమరజీవి త్యాగం మరువలేనిది: జిల్లా ఎస్పీ

image

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ప్రాణత్యాగం చేసిన మహానీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని జిల్లా ఎస్పీ వి. రత్న తెలిపారు. ఆదివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన మహోన్నత వ్యక్తి అని, ఆయన త్యాగం తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోతుందన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరారు.

Similar News

News March 18, 2025

ములుగు: అనుమానస్పద స్థితిలో మహిళా మృతి..?

image

కాటాపూర్ గ్రామానికి చెందిన ఈశ్వరి అనే మహిళ సోమవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అనుమానస్పద స్థితిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మృతి చెందిన ఈశ్వరి పక్కింటి వారితో గొడవపడ్డారని.. అనంతరం ఆమె ఇంట్లో మృతిచెంది కనిపించిందని తెలిపారు. ఈశ్వరి ఒంటిపై గాయాలు ఉన్నాయని పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని హత్యనా.? ఆత్మహత్యనా.? అనే కోణంలో విచారిస్తున్నారు.

News March 18, 2025

వింత వ్యాధి.. సూర్యాపేట జిల్లాలో భయం.. భయం..!

image

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ సహా వివిధ మండలాల్లో వీధి కుక్కలకు పది రోజులుగా వింత వ్యాధి సోకుతోందని స్థానికులు తెలిపారు. వాటి శరీరంపై పుండ్లు వ్యాపించి, నల్లరంగుతో కూడిన మచ్చలు ఏర్పడుతున్నాయన్నారు. ఓ కుక్క రెండు రోజుల క్రితం మూడేళ్ల బాలుడిని కరిచేందుకు వెంటాడింది. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నారు. చిన్నారులకు ప్రాణహాని ఉందని, అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.   

News March 18, 2025

MNCL: ఈ నంబర్లకు కాల్ చేయండి..!

image

ఏప్రిల్ 6న భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి వెళ్లలేని భక్తుల సౌకర్యార్థం లాజిస్టిక్ సేవ విభాగం ఆధ్వర్యంలో ఇంటి వద్దకే కళ్యాణ తలంబ్రాలు పంపిణీకి బుకింగ్‌ను సోమవారం మంచిర్యాల ఆర్టీసి డిపో మేనేజర్ జనార్దన్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. కళ్యాణం జరిగిన తర్వాత ముత్యాల తలంబ్రాలను పంపిణీ చేస్తామని తెలిపారు. అవసరమైన వారు 7382841860, 9866771482, 9154298541 నంబర్లలో సంప్రదించాలన్నారు.

error: Content is protected !!