News March 16, 2025
BRS రంగుల ప్రపంచాన్ని మాత్రమే చూపించింది: సీతక్క

సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన భారీ బహిరంగ సభలో మంత్రి సీతక్క మాట్లాడారు. కాంగ్రెస్ అంటేనే సంక్షేమం అన్నారు. గత 10 సంవత్సరాలలో కేవలం రంగుల ప్రపంచాన్ని మాత్రమే BRS చూపించింది.. కానీ అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ప్రజా పాలనలో సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్ష నాయకులు ఓర్వలేక పోతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అంటేనే మహిళలను అణగ తొక్కడం అని ఆరోపించారు.
Similar News
News July 5, 2025
గంజాయిని రూపుమాపేందుకు కృషి: సూర్యాపేట ఎస్పీ

గంజాయిని రూపుమాపేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తోందని SRPT జిల్లా SP నరసింహ అన్నారు. శనివారం కోదాడ మండలం దొరకుంట శివారులో గంజాయిని విక్రయిస్తూ పోలీసులకు చిక్కిన నిందితులు అడప రాకేశ్, వనపర్తి సాయిలును మీడియా ముందు ప్రవేశపెట్టి మాట్లాడారు. వీరి వద్ద నుంచి రూ.2.8 లక్షల విలువైన 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందితులను పట్టుకున్న సీఐ రజిత రెడ్డి, రూరల్ పోలీసులను SP అభినందించారు.
News July 5, 2025
కాసేపట్లో వర్షం: వాతావరణ కేంద్రం

TG: రాబోయే 2-3 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, జగిత్యాల, భూపాలపల్లి, గద్వాల్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, మెదక్, మేడ్చల్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో వర్షం పడుతుందని అంచనా వేసింది. గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
News July 5, 2025
HYD: స్వల్పంగా పెరిగిన డెంగీ కేసులు: మంత్రి

హైదరాబాద్లో డెంగీ కేసులు స్వల్పంగా పెరిగాయని మంత్రి దామోదర రాజనర్సింహా తెలిపారు. యాంటిలార్వా ఆపరేషన్లు ముమ్మరం చేయాలని, ట్రైబల్ ఏరియాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. ప్రైవేట్ ఆస్పత్రులు దోపిడీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స తీసుకోవాలని
మంత్రి సూచించారు.