News March 16, 2025

శ్రీ సత్య సాయి జిల్లా: పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు

image

రేపటి నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలలో భాగంగా పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ రత్నం పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల నుంచి 100 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్, నెట్ సెంటర్లను మూసివేయాలన్నారు. పరీక్షా కేంద్రాలకు వచ్చే విద్యార్థులు జాగ్రత్తగా ప్రయాణం చేసి గమ్యస్థానానికి చేరుకోవాలన్నారు.

Similar News

News November 6, 2025

ఫ్రెండ్ బైక్ ఢీకొని యువకుడి మృతి

image

స్నేహితుడి బర్త్ డే వేడుకలకు హాజరై తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన కోవూరు(M) కాపవరం వద్ద బుధవారం జరిగింది. రెల్లిపేటకు చెందిన గణేశ్, ఆనంద్, హేమంత్ జష్షు బర్త్ డే వేడుకల తర్వాత రెండు బైకులపై వస్తుండగా, తమ స్నేహితుల కోసం వెనక్కి వెళ్లే క్రమంలో స్నేహితుల వాహనాన్నే ఢీకొట్టారు. దీంతో గణేశ్ మృతి చెందగా, ఆనంద్, హేమంత్, జష్షుకు గాయాలయ్యాయి.

News November 6, 2025

NLG: రిజిస్ట్రేషన్ చివరి తేదీ మరో 4 రోజులే

image

వికసిత భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వికసిత్ భారత్ ప్రోగ్రాం చైర్మన్, నల్గొండ ఎన్జీ కళాశాల ప్రిన్సిపల్ సముద్రాల ఉపేందర్ కోరారు. దేశాభివృద్ధిలో విద్యార్థుల సృజనాత్మకత సందేశాత్మక వీడియో రూపొందించి అసెంబ్లీ, పార్లమెంటులో మాట్లాడే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. అందుకు ఈనెల 10వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.

News November 6, 2025

తొర్రూర్: పోక్సో కేసు నమోదు

image

బాలికపై అత్యాచారయత్నం చేసినందుకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తొర్రూర్ ఎస్ఐ ఉపేందర్ తెలిపారు. బాధితురాలు తనపై అత్యాచారయత్నం జరిగిందని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో నిందితుడి తల్లి, తండ్రి, నానమ్మ ముగ్గురూ కలిసి తమపై దాడి చేసి కొట్టారని బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ వెల్లడించారు.