News March 16, 2025

గ్రూప్-1 ఫలితాల్లో వారికి అన్యాయం: కవిత

image

TG: గ్రూప్-1 ఫలితాలపై అభ్యర్థులు లేవనెత్తుతున్న సందేహాలను ప్రభుత్వంతో పాటు TGPSC నివృత్తి చేయాలని BRS ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. పలు విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆమెను కలిసి చర్చించారు. పేపర్ వాల్యూయేషన్‌లో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందనే విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. గ్రూప్-2 ఫలితాల్లో 13వేల మందిని ఇన్వాలిడ్‌గా ఎలా ప్రకటించిందో చెప్పాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారన్నారు.

Similar News

News March 18, 2025

బీసీ రిజర్వేషన్లకు BRS వ్యతిరేకం : మంత్రి సీతక్క

image

బీసీ రిజర్వేషన్ల బిల్లుకు BRS మెుదటి నుంచి వ్యతిరేకంగా ఉందని మంత్రి సీతక్క విమర్శించారు. ఉదయం రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు ప్రకటించి సాయంత్రం మాట మారుస్తోందని మండిపడ్డారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా మైనార్టీ,ST రిజర్వేషన్లు పెంచలేదని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఆలోచనతో న్యాయనిపుణుల సలహాలతోనే కులగణన చేశామని తెలిపారు.

News March 18, 2025

IPL: ఓపెనింగ్ సెర్మనీకి దిశా పటానీ, శ్రద్ధా కపూర్

image

మరో 5 రోజుల్లో ఐపీఎల్ మహాసంగ్రామానికి తెర లేవనుంది. ఈ నెల 22న సాయంత్రం 6 గంటలకు జరిగే ఓపెనింగ్ సెర్మనీని ఈసారి మరింత గ్రాండ్‌గా నిర్వహించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్‌లో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేయనున్నట్లు సమాచారం. హీరోయిన్లు దిశా పటానీ, శ్రద్ధా దాస్, సింగర్స్ కరణ్ ఆజ్లా, శ్రేయా ఘోషల్ ఫర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్లు టాక్.

News March 18, 2025

యాదగిరి గుట్టకు పాలకమండలి: మంత్రి కొండా సురేఖ

image

TG: టీటీడీ తరహాలో యాదగిరి గుట్ట ఆలయానికి పాలకమండలి బోర్డు ఉండేలా చట్ట సవరణ చేసినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. అయితే బోర్డు స్వతంత్రంగా కాకుండా ప్రభుత్వ నియంత్రణలో ఉంటుందన్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో 60కిలోల బంగారం నిల్వలు ఉన్నాయని, అదే విధంగా రాష్ట్రంలోని ఆలయాల్లో ఉన్నపసిడి నిల్వల సమాచారం తెప్పిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

error: Content is protected !!